హీరోయిన్లలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఒకానొక దశలో ఆమె కెరీర్ అయిపోయిందనుకున్న తరుణంలో రాజా రాణి సినిమాతో మళ్ళీ కెరీర్ ని గాడిలో పెట్టుకుని దూసుకుపోతుంది. స్టార్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ తీసుకుంటూ హీరోయిన్లలో తన ప్రత్యేకతని చాటుకుంటుంది. సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

 

నయన తార ఈ ఏడాది రెండు పెద్ద చిత్రాల్లో నటించింది. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియా చిత్రం సైరా ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన తార చిరంజీవి భార్యగా నటించి, తన నటనతో ప్రేక్షకులని మెప్పించింది. ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. మరో చిత్రం తమిళ హీరో విజయ్ నటించిన బిగిల్. అత్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

ఆ తర్వాత ప్రస్తుతం రజనీ కాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "దర్బార్ " లోనూ నటిస్తుంది. ఇదిలా ఉంటే నయన తార ప్రస్తుతం గత కొద్దిరోజులుగా తన ప్రియుడు మరియు కాబోయే వాడు విగ్నేష్ శివన్ తో ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శిస్తున్నారు.కొన్నాళ్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతార లు రిలేషన్ షిప్ లోఉన్న సంగతి తెలిసిందే. నిన్న కన్యాకుమారిలోని భాగవతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఈ జంట నేడు తిరుచెందూర్ మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు.

 

వచ్చే ఏడాది ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని సమాచారం. నేనూ రౌడీనే సినిమా నుండి నయనతారకి విఘ్నేశ్ శివన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. మరి కొద్ది రోజుల్లో పెళ్ళి పీటలెక్కనుంది నయనతార ప్రస్తుతం నేత్రికన్, మూకుతి అమ్మన్ అనే తమిళ చిత్రాలతో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: