టాలీవుడ్ ని ప్రపంచ స్థాయికిలో కాలర్ ఎగురవేసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు అంతర్మథనంలో పడ్డట్టు తెలుస్తుంది. ఆయన తీస్తున్న సినిమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించన రాజమౌళి సినిమాలు ఇప్పటి వరకు ఒక్కటీ ఫెయిల్ కాలేదు అంటే ఆయన గొప్పతనం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 మూవీస్ జాతీయ స్థాయిలో తెలుగోడి సత్తా ఎంలో నిరూపించాయి. అవార్డులు, రివార్డుల ఒక్కటి కాదు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం జక్కన్న తెలుగు టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మద్య స్టార్ హీరోల సినిమా షూటింగ్ కి సంబంధించి ఫోటో, వీడియో లీక్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో బాహుబలి యుద్ద సీన్లు లీక్ కావడంతో జక్కన్న టీమ్ చాలా అలర్ట్ అయ్యింది. షూటింగ్ స్పాట్ లో సెల్ ఫోన్ నిషేదం.. సిక్రెట్ కెమెరాలు ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కాదేదీ లీకులకు అనర్హం అన్నట్లు షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా జక్కన్న టీమ్ కి మరో షాక్ తగిలింది. ఇటీవలే ఆర్ ఆర్ఆర్ సినిమా మూడో షెడ్యూల్ వడోదరాలో ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రాధారులందరూ పాల్గొంటుండగా.. వారిపై భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్లను చిత్రీకరించనున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో తాజాగా హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ చిత్ర ఫోటోస్ లీక్ కాకుండా ఉంచలేకపోతున్నారు. ఎన్టీఆర్ కి సంబంధించి కొమురంభీమ్ సీన్ గురించి వివరించడం..ఎన్టీఆర్ అక్కడ గిరిజనులుగా జూనియర్ ఆర్టిస్టులు సందడి తో ఉన్న వీడియో ఫోటోస్ లీక్ కావడం ఆర్ఆర్ఆర్ టీమ్ కి మింగుడు పడకుందా ఉంది. దాంతో ఇలాంటి సంఘటనలు మల్లీ జరగకుండా జక్కన్న సీరియస్ గా ఉంటున్నట్లు సమాచారం.