టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది వారసత్వపు హీరోలు వచ్చారు.  మొదటి సారిగా స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేశ్ ‘కలియుగపాండవులు’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  విక్టరీ తన పేరు ముందు పెట్టుకున్న వెంకటేష్ కెరీర్ ప్రారంభంలో యాక్షన్ తరహా సినిమాల్లో నటించారు.  ఆ తర్వాత ఫ్యామిలీ పాత్రల్లో నటించి కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో  'వెంకీమామ' మూవీలో నటిస్తున్నారు.   ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించారు. ఈ మూవీలో నాగ చైతన్య కూడా నటిస్తున్నారు.  

 

రిల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో వెంకటేష్ - నాగ చైతన్యలు మామా అళ్లుల్లు కావడం విశేషం. ఈ నెల 13న ‘వెంకిమామ’ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.  ఈ మద్య ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించారు.  ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆర్మీ మాన్ గా చైతూ తన నటనతో దుమ్మురేపారట.. ఈ విషయం స్వయంగా వెంకటేష్ తెలిపారు.  ఇక మామా అళ్లుళ్లు సందడి హంగామా కడుపుబ్బా నవ్విస్తుందట. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ బిజీలో పడ్డారు చిత్ర యూనిట్.  తాజాగా ఈ మూవీ గురించి మరో సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

 

ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట.  ఆ మద్య చైతూ-సమంత కలిసి నటించిన మజిలీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా వుంచారట. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ వార్తను బయటికి వదిలినట్టుగా తెలుస్తోంది. ఈ వార్త ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ.. ఫిలిమ్ వర్గాల్లో టాక్ మాత్రం నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: