ఎన్టీఆర్ బయోపిక్ తరువాత  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్.   ప్రముఖ సీనియర్ డైరెక్టర్  కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  పూర్తి చేసుకొని  విడుదలకు సిద్దమవుతుంది.  సుమారు 30కోట్ల  బడ్జెట్ తో  ప్రముఖ నిర్మాత  సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  అయితే  ప్రీ రిలీజ్  విషయంలో మాత్రం  ఈ చిత్రం  దారుణంగా నిరాశపరిచింది.  ఎన్టీఆర్ బయోపిక్  భారీ డిజాస్టర్ కావడం  అలాగే ఇటీవల విడుదలైన  రూలర్ టీజర్ , ట్రైలర్ లు అనుకున్నంత  రెస్పాన్స్  తెచ్చుకోకపోవడంతో  ఈ చిత్రం  పై పెద్దగా బజ్  ఏర్పడలేదు.  దాంతో  తక్కువ ధరకే ఈసినిమాను  అమ్మారు నిర్మాత.  అలా చేయడం వల్ల  15కోట్ల  డెఫిసిటీ తో   విడుదలవుతుంది ఈ చిత్రం.  
 
 
ఒకవేళ  సినిమా కు గనుక  హిట్ టాక్ వస్తే   బయ్యర్లు  భారీగా లాభ  పడనున్నారు. హై  వోల్టేజ్ యాక్షన్  ఎంటర్ టైనర్ గా రానున్న  ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా  సోనాల్ చౌహన్ , వేదిక  నటిస్తుండగా  సీనియర్ నటి  భూమిక  చావ్లా  ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.  ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈచిత్రం  ప్రేక్షకులముందుకు రానుంది. ఇక కె ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 'జై సింహ' గత ఏడాది జనవరిలో విడుదలై  మంచి వసూళ్లను రాబట్టి పర్వాలేదనిపించింది.
 
 
ఇక ప్రస్తుతం  బాలయ్య , మాస్ డైరెక్టర్  బోయపాటి శ్రీను  డైరెక్షన్ లో మూడో సారి నటిస్తున్నాడు.  గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన  సింహ , లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్లు  కావడంతో  ఈకాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: