ఎన్టీఆర్ బయోపిక్ తరువాత నందమూరి నటసింహం
బాలకృష్ణ నటించిన లేటెస్ట్
మూవీ రూలర్. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కె ఎస్
రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. సుమారు 30కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత
సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ప్రీ రిలీజ్ విషయంలో మాత్రం ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది.
ఎన్టీఆర్ బయోపిక్ భారీ డిజాస్టర్ కావడం అలాగే ఇటీవల విడుదలైన
రూలర్ టీజర్ , ట్రైలర్ లు అనుకున్నంత రెస్పాన్స్ తెచ్చుకోకపోవడంతో ఈ చిత్రం పై పెద్దగా బజ్ ఏర్పడలేదు. దాంతో తక్కువ ధరకే ఈసినిమాను అమ్మారు నిర్మాత. అలా చేయడం వల్ల 15కోట్ల డెఫిసిటీ తో విడుదలవుతుంది ఈ చిత్రం.
ఒకవేళ
సినిమా కు గనుక హిట్ టాక్ వస్తే బయ్యర్లు భారీగా లాభ పడనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో
బాలయ్య కు జోడిగా సోనాల్ చౌహన్ , వేదిక నటిస్తుండగా సీనియర్ నటి భూమిక చావ్లా ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి
బాలీవుడ్ సంగీత దర్శకుడు
చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.
డిసెంబర్ 20న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక కె ఎస్
రవి కుమార్ ,
బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 'జై సింహ' గత ఏడాది జనవరిలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టి పర్వాలేదనిపించింది.
ఇక ప్రస్తుతం
బాలయ్య , మాస్ డైరెక్టర్
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మూడో సారి నటిస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన
సింహ ,
లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్లు కావడంతో ఈకాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.