అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురంలో’ మూవీ పై  రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ పాటల మ్యానియా ఎక్కడ చూసినా కనిపిస్తున్న నేపధ్యంలో బన్నీ త్రివిక్రమ్ లు ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ బన్నీ అభిమానులు ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాను ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ గా రికార్డు దక్కించుకున్న ఐమాక్స్ మెల్ బోర్న్ స్క్రీన్ లో ప్రదర్శించేందుకు రంగం సిద్దం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు జనవరి 12 ఉదయం 7.30 గంటలకు ఈ చిత్రంను అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ పై ప్రదర్శించబోతున్నట్లు టాక్. 

ఈ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఆస్ట్రేలియాలో విడుదల చేయబోతూ ఉండటం ఒక రికార్డు అని అంటున్నారు. ఇప్పటి వరకు అతికొద్ది ఇండియన్ సినిమాలు మాత్రమే ఈ పెద్ద స్క్రీన్ పై ప్రదర్శితం అయ్యాయి. వాటి జాబితాలో ‘అల వైకుంఠపురములో’ కూడా చోటు దక్కించుకావడంతో బన్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 

వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ పై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వస్తున్నా ఆ రూమర్లను త్రివిక్రమ్ ఖండించకపోవడంతో బయటకు లీక్ అయిన ఈ మూవీ కథ నిజమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న టబు గంభీరమైన నటన ఈ మూవీ స్థాయిని మరింత పెంచుతుంది అని అంటున్నారు. అల్లు అర్జున్ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్స్ వచ్చినా 200 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అతడు ఇప్పటి వరకు అందుకోలేక పోయాడు. టాప్ యంగ్ హీరోలు సినిమాలు చాలవరకు 200 కోట్ల మార్క్ ను అందుకుంటున్న నేపధ్యంలో ఆలోటును ‘అల వైకుంఠప్రములో’ తీరుస్తుంది అన్న గంపెడు ఆశతో రాబోతున్న సంక్రాంతి రేసుకు సిద్ధం అవుతున్నాడు..

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: