స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండి తెర మీద కనిపించి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయన చివరి చిత్రం దువ్వాడ జగన్నాథం అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. దీనితో ఆయన తదుపరి చిత్రం కోసం చాలా రోజులు వేచి చూశాడు. చివరికి ఇంత ముందు తనకు రెండు హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురం సినిమాలో నటిస్తున్నాడు.

 

ఈ సినిమాలో హీరోయిన్ గా దువ్వాడ జగన్నాథం భామ పూజ హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి అలనాటి అందాల తార టబు తిరిగి రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు పాటలు యూట్యూబ్ లో తెలుగు వారికి సంబంధించి సరికొత్త రికార్డులు కూడా సృష్టించాయి.

 

ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు ఈ సినిమా టీజర్ రిలీజ్  అయింది. టీజర్ మొత్తం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మనందరి మాయ చేస్తాడని అర్థమవుతుంది. అలాగే అల్లు అర్జున్ కూడా ఇంత స్టైల్ గా తన కెరీర్లో ఇంతవరకు కనిపించలేదు అని చెప్పాలి. అలాగే తమను కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని ఒక రేంజ్ కి తీసుకువెళ్లారు అని అర్థమవుతుంది

 

 ఈ సినిమా జనవరి 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఆ టీజర్ రికార్డుని బద్దలు కొట్టే ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేశారు అలా వైకుంఠపురం యూనిట్ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: