టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మరియు నిన్న రిలీజ్ అయిన టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే యూట్యూబ్ లో అత్యధిక లైక్స్ మరియు వ్యూస్ దక్కించుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

 

బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, టబు, మురళి శర్మ, జయరాం, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా అఫీషియల్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. గ్రాండియర్ లుక్స్ మరియు యాక్షన్, ఎమోషన్, రొమాంటిక్ సీన్స్ తో పాటు అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టిన ఈ టీజర్ కు వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 

 

'మీ నాన్న నిన్ను పెళ్లి కూతురుని పెంచినట్లు పెంచాడు రా' అంటూ వచ్చే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. ఇక టీజర్ చివర్లో 'మీరు ఇప్పుడే కార్ దిగారు, కానీ నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాను' అంటూ బన్నీ పలికే డైలాగ్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ తో సినిమాపై బన్నీ ఫ్యాన్స్ లో మరియు ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: