ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటె తప్ప ఆయనకు నిద్ర రాదు.. ముద్ద దిగదు. అలాంటి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఎప్పుడు ఏదోక వివాదంలో మునిగి తేలే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్న ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ బయో పిక్ తీసి చంద్రబాబుని భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో చిత్రంతో చంద్రబాబు నాయుడుని బయపెడుతున్నాడు. 

 

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే రక్తం ఉడికిపోతుంది!!

 

అదే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సారీ సారీ.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రాన్ని ప్రస్తుత రాజకీయాలపై అంటూ తీసాడు. ఈ చిత్రంతో ప్రతిపక్షాలకు వణుకు పుడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గత నెల 29న విడుదల అవ్వాల్సింది. కానీ సెన్సార్ లేక పోవడం వల్ల.. కేఏ పాల్ కోర్టును ఆశ్రయించడం వల్ల ఇలా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. 

 

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులు ఎంత అదృష్టవంతులో !!

 

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను రేపు అంటే ఈ 12వ తేదీన అని ప్రకటించేశారు. సినిమా సెన్సార్ కూడా అయిపోయిందని అన్నారు. సినిమా విడుదల తేదీ పోస్టర్లతో రెండు రోజులుగా ట్విట్టర్‌లో తెగ హడావుడి చేస్తున్నారు. కొన్ని సీన్లు కట్ చెయ్యడంతో సెన్సార్ అయ్యింది అని చెప్పారు. అయితే నిజానికి ఈ సినిమా సెన్సార్ ఇంకా పూర్తవ్వలేదట. 

 

'పవన్ కళ్యాణ్'కు షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే.. 'జగన్'కు మద్దతు

 

సినిమా చూసిన రివైజింగ్ కమిటీ సభ్యులు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు నిర్మాతకు చెప్పారని.. అయితే, సెన్సార్ ఆఫీసర్ సర్టిఫికెట్‌పై ఇంకా సంతకం పెట్టలేదని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో రేపు సినిమా విడుదల ఉండటంతో ఇప్పటికీ ఇంకా సర్టిఫికెట్ నిర్మాత చేతికి చేరలేదు అని ఈ సర్టిఫికెట్ కోసం కవాడిగూడలోని సెన్సార్ ఆఫీస్ చుట్టూ నిర్మాత తిరుగుతున్నారు. 

 

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే రక్తం ఉడికిపోతుంది!!

 

అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ సినిమా విడుదల రేపు అవుతుంది అని హడావుడి చేసేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది రేపు రిలీజ్ అయ్యేవరకు తెలియదు. ఏది ఏమైనా ఈ సినిమాతో మరో సారి రామ్ గోపాల్ వర్మ నిరూపించుకున్నాడు. తన సినిమాలు అన్ని వాయిదా పడక తప్పదు అని.

మరింత సమాచారం తెలుసుకోండి: