టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార పూజా హెగ్డే నటించిన ‘అలా వైకుంఠపురములో’ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, లిరిక్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. సామ జవరగమనా, రాములో రాములా సాంగ్స్ యూట్యూబ్ లో కొత్త రికార్డులే క్రియేట్ చేశాయి. అయితే టీజర్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అల వైకుంఠపురములో..’ సినిమా టీజర్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ చూస్తుంటే.. త్రివిక్రమ్ స్థాయిలో క్యాచీగా వుంది. మొత్తం స్టయిలీష్ ప్రజంటేషన్ తో ఆకట్టుకుంది.
ఇక టీజర్ లో అల్లు అర్జున్ పంచ్ డైలాగ్స్ నిజంగా అదుర్స్ అంటున్నారు. గట్టిటోడివిరా... స్టైల్గా ఉందిగా..నాకు కూడా నచ్చింది. మేడం సార్.. మేడమ్ అంతే! అనే డైలాగ్తో పాటు సముద్రఖని మేనరిజమ్ను ఇమిటేట్ చేస్తూ..మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కాను అనే మాస్ డైలాగ్.. చివరల్లో కత్తిచివన వచ్చే అగ్గితో బన్నీ బీడీ వెలిగించుకోవడం చూస్తుంటే బన్నీ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం అవుతుంది. ఓ వైపు కామెడీ.. మరోవైపు సీరియస్ యాక్షన్ తో బన్నీ ఇరగదీశాడు. నపడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా కలర్ఫుల్ ఎలిమెంట్స్తో పాటు బన్నీ అభిమానులను ఆకట్టుకునేలా మాస్ ఫైట్, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని టీజర్ చెప్పేస్తుంది.
జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సంకాంత్రి బరిలో దిగుతున్న ఈ సినిమా టీజర్ లో కూడా సంక్రాంతి పుంజు చూపించారు. అల..వైకుంఠపురములో మలయాళంలో కూడా సందడి చేయనుంది. ఈ సినిమాలో సుశాంత్, నివేదా పెతురాజ్, టబు, జయరామ్, సముద్రఖని కీలక పాత్రలలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.