విక్టరీ వెంకటేష్ - నాగచైతన్య కథానాయకులుగా ( కె.రవీంద్ర ) బాబి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వెంకీమామ. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. పీపుల్స్ మీడియాతో కలిసి డి.సురేష్ బాబు ఈ సినిమా నిర్మించారు. వెంకీమామ నిర్మాత విశ్వప్రసాద్ టాలీవుడ్ లో వరుసగా సినిమాలకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆర్.ఎక్స్.100 గ్లామర్ బ్యూటి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. వాస్తవంగా ఈ సినిమా ఈ ఇద్దరి హీరోయిన్స్ కి ఎంతో కీలకం. ఒకవేళ వెంకీమామ గనక హిట్టయితే పాయల్ కి మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే ఇక అంతే సంగతులు.

 

ఇక వెంకీమామ రిలీజ్ ముందు దగ్గుబాటి కుటుంబ హీరోల ప్రమోషన్ పీక్స్ కు చేరుకుంది. వెంకీ- చైతూలకు అండగా రానా ఇప్పటికే బోలెడంత ప్రమోషన్ చేశారు. మీడియా ఇంటరాక్షన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఇక సోషల్ మీడియా ప్రమోషన్ అయితే చెప్పాల్సిన పనేలేదు. కంటిన్యూస్ గా సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అసలే ఈ సినిమా రిలీజ్ బోలెడన్ని వాయిదాల తర్వాత ఇప్పుడు ఒక డేట్ లాక్ అయి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదీ కాక అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైందని కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో న్యూస్ బాగా హల్‌చల్ చేశాయి. అందుకే ఎలాగైనా సినిమాని గట్టెక్కించాలని ఫ్యమిలీ మొత్తం ప్రమోషన్స్ లో నిమగ్నమై ఉన్నారు. 

 

ఇక తాజా సమాచారం ప్రకారం.. వెంకీమామలో ఊహించని అతిధి సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అక్కినేని కోడలు.. చైతన్య సతీమణి సమంత వెండితెర మీద తళుక్కుమని మెరుస్తారని లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన సీన్స్ ని సమంతపై షూటింగ్ కూడా చేశారు కానీ. ఫైనల్ వెర్షన్ లో తనని ఉంచారా.. కట్ చేశారా? అన్న డైలమాలో ఉన్నారు. ఈ తరహా గెస్ట్ రోల్స్ సినిమాపై హైప్ పెంచుతాయనడంలో సందేహం లేదు. చైతన్య-సమంత జంటగా నటించిన మజిలీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో ఆ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లోకి వస్తే చైతూ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారేమో!! మరి సామ్ పోర్షన్ ని ఎడిటింగ్ లో తీసేశారా లేదా అన్నది సినిమా రిలీజయ్యాక థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: