దాదాపు నాలుగు సంవత్సరాల నుండి విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోందని ఎన్నో వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ రచయిత గా వెంకటేష్ నటించిన 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలకు వర్క్ చేశాడు. అప్పుడే త్రివిక్రమ్ కు వెంకటేష్ అవకాశం ఇవ్వాలనుకున్నాడు. కాని కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే ఎప్పటిలాగే మళ్లీ రీసెంట్‌గా ఈ ఇద్దరు తమ కాంబోలో అనుకున్న సినిమా గురించి మాట్లాడారు. వెంకటేష్ ఆమద్య ఒక ఇంటర్వ్యూ లో నాకు యాప్ట్ అయ్యే కథను తీసుకు వస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పాడు కూడా.

 

త్రివిక్రమ్.. వెంకటేష్ ల కాంబో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వస్తున్నారు. వాస్తవంగా  ఎఫ్ 2 తర్వాత త్రివిక్రమ్ తో వెంకీ సినిమా చేస్తాడనుకున్నారందరు. కాని వెంకీ మామ సినిమాతో బిజీ అయ్యాడు. వెంకీ మామ తర్వాత కూడా వెంకటేష్ మాటల మాంత్రికుడితో సినిమా చేయడం కష్టమని తాజా పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే వెంకీ మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ కూడా అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఒక యంగ్ స్టార్ హీరోతో సినిమాను చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.

 

ఇలా ఇద్దరు వరుసగా వేరు వేరు సినిమాలు కమిటయి బిజీగా ఉన్నారు. దాంతో వీరి కాంబో మూవీపై అప్పుడు ఆసక్తి చూపించారు కాని.. ఇప్పుడు వారికి అదే ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు.. అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా ఆలోచనను పక్కకు పెట్టినట్లున్నాడు అనుకుంటున్నారు. ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ లేదని.. ఎవరికి వారే వరుస గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారంటూ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇదే నిజమా అన్న విషయంలో అటు వెంకీ గాని ఇటు త్రివిక్రమ్ గాని క్లారిటి ఇస్తే బావుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: