‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఇటీవల ఈ చిత్రం పలు రకాలుగా వివాదస్పద గురైనది ఈ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంతటి వివాదస్పద చిత్రం విడుదలకు ఇప్పుడు మార్గం సుగుమమైంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించారు దీని తరువాత యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ఈ గురువారం విడుదల కానుంది. విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో చిత్ర డైరెక్టర్ సిద్దూ, నిర్మాత నట్టి కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం ఈ సినిమాపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇంత జరిగిన ఇంకా ఈ చిత్రాన్ని ఆపడానికి పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు .సెన్సార్ బోర్డు వివాదస్పదమైన ఈ చిత్రానికి ఎలా అనుమతి ఇస్తుందని, అదేవిధంగా విడుదల ఆపాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ పిటిషన్లపై సెన్సార్ బోర్డు, చిత్ర యూనిట్ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు వాదనలు విని రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
బుధవారం సాయంత్రం రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చిత్ర యూనిట్కు సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికేట్ను అందజేశారు. దీంతో సినీ వర్గాలు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లేనని పేర్కొంటున్నాయి. ఇక రాంగోపాల్ వర్మ ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ రావడంపై ట్విటర్ వేదికగా ఆయన సంతోషంగా స్పందించాడు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్ర విడుదలను ఆపాలనుకున్న వాళ్లుకు బ్యాడ్ న్యూస్.
సెన్సార్ సర్టిఫికేట్ ఈ సినిమాకు వచ్చింది. డిసెంబర్ 12న చిత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే విడుదల కానుంది. కొందరు జోకర్లు, కన్నింగ్ వ్యక్తులు సినిమా విడుదలను ఆలస్యం చేసినప్పటికీ భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చను ఆపలేకపోయారు’ అంటూ ట్వీట్ చేశాడు.