స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు (11-12-19) నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్  వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది.  ముఖ్యంగా అల్లు అర్జున్  ఈ టీజర్ లో "నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా" అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా  ఆకట్టుకుంటోంది..

 

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

 

టీజర్ కే ఇలా రెస్పాన్స్ వస్తుందంటే, ట్రైలర్ కి ఇంకా ఏ రేంజ్ లో వస్తుందో ఉహించవచ్చు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే తనకు తానుగా ఇలా రికార్డులని సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో. అలా వైకుంఠపురంలో చిత్రానికి థమన్ సంగీతం అదుర్స్ అని ప్రేక్షకులు అంటున్నారు. త్రివిక్రమ్-బన్నీ-థమన్ కాంబినేషన్ చాల అద్భుతంగా వుంది అంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తుంది.

 

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: