స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిగా బన్నీ నటిస్తున్న ఈ సినిమాలో, పూజ హెగ్డే అదే కంపెనీ సీఈవో గా నటిస్తున్నట్లు సమాచారం. 

 

ఇక ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా శ్రోతలను ఎంతో అలరించడంతో పాటు అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ దక్కించుకున్నాయి. ఇక రెండు రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఆ గ్లింప్స్ కు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఆ టీజర్ ని షాకింగ్ గా కాసేపటి క్రితం యూట్యూబ్ నుండి తొలగించబడింది. ప్రస్తుతం ఆ టీజర్ కోసం హారిక హాసిని క్రియేషన్స్ వారి యూట్యూబ్ ఛానల్ లో వెతికిన వారికి ఆ వీడియో లభ్యం కావడం లేదు, 

 

కాకపోతే పాత లింక్స్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే మాత్రం కనపడుతోంది. అయితే ఏమి జరిగింది అనేది తెలియదు గాని, ఆ వీడియోని ప్రస్తుతం తొలగించి అన్ లిస్ట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. అయితే రెండు వీడియోలు ఒకేసారి ట్రేండింగ్ లో ఉన్నపుడు ఆటోమేటిక్ గా ఒక వీడియోని తొలగించడం జరుగుతుందని కొందరు బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా అఫీషియల్ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు. ఆ టీజర్ ప్రస్తుతం అత్యధిక వ్యూస్ తో దూసుపోతోంది. మరి గ్లింప్స్ టీజర్ తొలగింపు విషయమై ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్  సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: