త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఈ రెండు మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో అల వైకుంఠపురంలో అనే సినిమా వస్తుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ ఎత్తున్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాని రెండు సినిమాలను ఇన్సిపిరేషన్ గా తీసుకుని త్రివిక్రమ్ తెరకెక్కించినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. త్రివిక్రమ్ ఏ సినిమా చేసినా కూడా విమర్శలు పక్కన పెడితే కాపీ కొడుతాడనే కామెంట్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.
అలాగే అల వైకుంఠపురంలో సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మలయాళ మూవీ మై బాస్ మరియు తెలుగు పాత చిత్రం ఇంటిగుట్టు అనే రెండు చిత్రాల కథను మిక్స్ చేసి మిక్సీలో వేసి కొత్త కథను త్రివిక్రమ్ రాసినట్లుగా సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్తో గతంలో ఈయన తీసిన అజ్ఞాత వాసి మరియు ఇంకా కొన్ని సినిమాలు కూడా కాపీ అంటూ తేలిన విషయం తెల్సిందే. ఒకప్పుడు త్రివిక్రమ్ అంటే గౌరవం ఉండేది. మంచి కథ, డైలాగ్స్ బాగుంటాయని.
కానీ ఇప్పుడు ఆయన సినిమా కథలు కాపీ కొడుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న ఈ కాంబోకి ఇబ్బందిని కలిగిస్తున్నాయి ఈ కాపీ కామెంట్స్. అయితే సినిమా హిట్ అవుతే ఇవన్నీ ప్రేక్షకులు పట్టించుకోరు.
అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రంలో టబు, సుశాంత్, నవదీప్, జయరామ్, సముద్రఖని, మురళీ శర్మ, నివేతా పేతురాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.