రేపు విడుదల కాబోతున్న ‘వెంకీ మామ’ మూవీని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లలో విడుదలచేసి ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రప్పించాలి అన్న వ్యూహాలలో ఈ మూవీ నిర్మాతలు ఉన్నారు. ఈ మూవీకి ఊహించని విధంగా పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ హవా సంక్రాంతి వరకు కొనసాగుతుంది అన్న అంచనాలలో నిర్మాత సురేశ్ బాబు ఉన్నట్లు టాక్. 

మూవీ బడ్జెట్ 40 కోట్లు దాటిపోవడంతో కొన్ని ఏరియాలలో ఈ మూవీకి సురేశ్ బాబు అడిగిన రేట్లు రాకపోవడంతో డైరెక్ట్ గా ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ మూవీ ఓపెనింగ్స్ బాగుంటాయని ఈ మూవీ నిర్మాతలు భావించినా ఈ మూవీ ఆన్ లైన్ టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ అయినా ఇంకా స్పీడ్ అందుకోకపోవడం సురేశ్ బాబును కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి అత్యంత భారీ ప్రమోషన్ చేయడమే కాకుండా అన్ని ఛానల్స్ కు యాడ్స్ విరివిగా ఇచ్చి ఈ మూవీ విడుదల విషయాన్ని అందరికీ తెలిసి వచ్చేలా గట్టి ప్రయత్నాలే చేసారు. ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఒక సీక్రెట్ సెన్సార్ వర్గాల ద్వారా బయటపడినట్లు తెలుస్తోంది. 

ఈ మూవీలో సమంత ఒక కీలక అతిథి పాత్ర చేసినట్లు ఈ మూవీని ఇప్పటికే చూసిన సెన్సార్ సభ్యుల నుండి లీకులు వస్తున్నాయి. ‘వెంకీ మామ’ కథలో ఒక అతిథి పాత్ర అవసరం రావడంతో పాటు ఆ పాత్ర కూడ కీలక సమయంలో ఈ మూవీ కథలో ఎంటర్ అయ్యే పరిస్థితులలో సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ అతిథి పాత్రను సమంతతో చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పాత్ర చైతన్య చుట్టూ కనెక్ట్ అవుతుందా లేదంటే వెంకటేష్ చుట్టూ కనెక్ట్ అవుతుందా అన్న క్లారిటీ లేకపోయినా ఈ మూవీలో సమంత అతిథి పాత్రలో కనిపించడం ఖాయం అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: