‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ జరుగుతున్న నేపధ్యంలో బన్నీ మహేష్ అభిమానుల మధ్య కూడ అదే స్థాయిలో వార్ జరుగుతోంది. ఇప్పటి వరకు ‘అల వైకుంఠపురములో’ మూవీని  జనవరి 12న విడుదల చేస్తున్నామని ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాకు సంబంధించిన  ప్రతి ప్రోమోలోను ఆ రిలీజ్ డేట్‌ మెన్షన్‌ చేస్తూ వచ్చారు. 

కానీ నిన్న విడుదలైన టీజర్‌లో మాత్రం సంక్రాంతి 2020 అని మాత్రమే కనిపించడంతో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ మారుతుందా అంటూ సందేహాలు మొదలైయ్యాయి. అదేవిధంగా ఒకే ఒక్కసారి రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' మూవీ మేకర్స్ కూడ జనవరి 12 డేట్‌ మళ్ళీ స్ట్రెస్‌ చేయడంలేదు.

దీనితో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సినిమాల డేట్స్ మారుతున్నాయా అంటూ ఊహాగానాలు ఊపు అందుకున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య ఒక రాజీ కుదిరి ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న ‘అల వైకుంఠపురములో’ జనవరి 12న విడుదలవుతాయని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపించాయి. 

అయితే ఇంత వరకు ‘సరిలేరు నీకెవ్వరు’ కి జనవరి 11న రిలీజ్ అన్న విషయం  అధికారికంగా ప్రకటింపబడలేదు. దీనితో ఈరెండు సినిమాల నిర్మాతల మధ్య ఒక అవగాహన ఇప్పటికీ రాలేదనీ నిన్న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ను బట్టి అర్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సంక్రాంతి రేస్ ను చూసి భయపడిపోతున్న మహేష్ బన్నీ సినిమాల బయ్యర్లు ఇప్పుడు నిన్న విడుదలైన ‘అల వైకుంఠపురములో’ టీజర్ ను చూసి మరింత కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ టెన్షన్ కు గురి చేస్తున్న మహేష్ బన్నీల ఇగో వార్ ముదిరిపోయి ఏ రేంజ్ కు వెళ్ళిపోతుందో తెలియక తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: