ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టించే ఆర్జీవి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో సెన్సేషనల్ మూవీ తీశాడు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంను టార్గెట్ చేస్తూ వర్మ చేసిన ఈ సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో  గొడవలు సృష్టించింది. ఆల్రెడీ కోర్ట్ లో కేసు నడవగా సెన్సార్ సభ్యులు కూడా సెన్సార్ చేయమని చెప్పారు. 

 

టైటిల్ మార్చిన తర్వాత కొన్ని సీన్స్ కట్ చేశాక ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు కాస్త అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మారింది. బుధవారం ఈసినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. అలా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందో లేదో ఈరోజు సినిమా ఎనౌన్స్ చేశాడు వర్మ. 

 

తను చేసే ప్రతి సినిమాలో మ్యాటర్ ఎలా ఉన్నా ప్రమోషన్స్ తో సినిమా కోసం ఎదురుచూసేలా చేసే వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు కూడా ప్రేక్షకుల్లో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సినిమా లో వర్మ ఎవరిని టార్గెట్ చేశాడో అందరికి తెలుసు. ఇలాంటి సినిమాలు తీయడం కేవలం వర్మ వల్లే అవుతుందని కూడా చెప్పొచ్చు. 

 

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కుడా రిలీజ్ కు ముందు ఇలాంటి హడావిడి చేసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఏపీ ఎలక్షన్స్ లో ఆ సినిమా ప్రభావం బాగానే పడ్డది. మరి ఈ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ముందురోజు సెన్సార్ అయ్యి ఆ తర్వాత రోజే సినిమా రిలీజ్ అయిన సినిమాలు చాలా తక్కువ వాటిలో ఈ సినిమా కూడా చేరింది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకుముందు సినిమా తీసేంత వరకు కనిపించి రిలీజ్ లైట్ తీసుకునే వర్మ ఈ సినిమాల విషయంలో మాత్రం ఫైట్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: