దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అమ్ంచనాలు భారీగా ఉన్నాయి. అదీగాక ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్లు నటించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. బాహుబలి ద్వారా తెలుగు సినిమా విజయకేతనాన్ని ఎగరవేసిన రాజమౌళి మరో మారు ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు.

 

అయితే ఈ సినిమాకి ఇంకా అధికారిక టైటిల్ నిర్ణయించలేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కి జోడోగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ ఎంపికైంది. ఇప్పటికే ఈ సినిమాలో విలన్లని ప్రకటించిన ఆర్.ఆర్.ఆర్ టీమ్ చిత్రీకరణని చాలా వేగవంతం చేసింది.

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది.  గత రెండు రోజులుగా ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ నందు రామ్ చరణ్ జాయిన్ అవుతున్నారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఓ అవార్డు వేడుకలో భాగంగా చెన్నై వెళ్లిన రాంచరణ్ నిన్న హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. దీనితో ఆయన వైజాగ్ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం కలదని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. 

 

ఒక వేళ ఈ షెడ్యూల్ నందు కేవలం ఎన్టీఆర్ పైనే చిత్రీకరణ ఉన్నట్లయితే రామ్ చరణ్ పాల్గొనకపోవచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 300 కోట్లు ఉంటుందట. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30 న విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: