సంచలన దర్శకుడు ఆర్జివి తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కపడ రెడ్లు అదేనండి టైటిల్ మార్చి ఆ సినిమానే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా రిలీజ్ చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో చూస్తున్న ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. చంద్రబాబుని ఇంత డైరెక్ట్ గా ఎటాక్ చేయడం వర్మ ఒక్కడికే చెల్లిందని అందరు అంటున్నారు. అంతేకాదు అసలు వర్మ ఏం చేశాడు అని చూసేందుకు వెళ్లిన తెలుగు తమ్ముళ్లు కూడా ముక్కున వేలేసుకునేలా చేశాడు వర్మ.

 

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లోనే చంద్రబాబు వెన్నుపోటు గురించి హైలెట్ చేస్తూ సినిమా తీసిన వర్మ ఈసారి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలులో మరింత టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. జగన్ సిఎం అవడం బాబు, లోకేష్ బాధపడటం దగ్గర నుండి సినిమా మొదలవుతుంది. ఈ సినిమా ద్వారా వర్మ బాబు మీద తనకున్న కసి అంతా బయటపెట్టాడని చెప్పొచ్చు.

 

వెలుగుదేశం పార్టీ అధినేత పార్వని.. పెద్దాయనను వెన్నుపోటు పొడిచా.. పదవి ఎలా ఉంటుందో దాని పొగరు ఎలా ఉంట్నుందో నాకు బాగా తెలుసు.. ఇన్ని చేసిన నన్ను దేవుడు వెన్నుపోటు పొడిచాడు. దేవుడు పులి కడుపున ఓ పిల్లిని పుట్టించాడు.. వాడు గదిలో దూరి దుప్పట్ ముసుగు పెట్టి ఏడుస్తున్నప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుంది రమా అంటూ బాబు పాత్ర చెప్పడం వర్మసినిమా ఎందుకు తీశాడో అర్ధమవుతుంది.

 

అంతేకాదు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలులో వర్మ డైరెక్ట్ ఎటాక్ చేశాడు. తను చెప్పదలచుకున్న పాయింట్ ఏదైనా స్ట్రైంట్ గా చెప్పే ఆర్జివి ఈ సినిమాలో మొదటి నుండి బాబు అండ్ బ్యాచ్ ను టార్గెట్ చేస్తూ సంచలనం సృష్టించాడు. అయితే సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది కనుక ఈ సినిమాను ఎవరు అడ్డుకునే అవకాశం లేదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: