పవన్ కళ్యాణ్ ఈ  పేరు అందరికి సుపరిచితమే. తెలియని వారు ఎవరు ఉండరు. పవర్ స్టార్ తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.. అయన నటన, స్టైల్, జీవన శైలి లో ఒక ప్రత్యేకమైన పేరు ఏర్పరుచుకున్నారు.. సమాజ సేవలోను ముందుంటారు..పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన గాని ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఎ మాత్రం తగ్గదు.

కొన్ని రోజులగా పవర్ స్టార్ రాజకీయాలలో బిజీ గా ఉండడం వల్ల సినిమాల్లో నటించడానికి సమయం కుదరడం లేదు. అయన చివరి సినిమా అజ్ఞాతవాసి. తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఈమధ్య మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారన్న వార్త వెలువడింది..

చాలా మంది దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలనీ ప్రయత్నించారు. కాని ఆ ఒక్క దర్శకుడు వల్ల మాత్రమే జరిగింది. అదేనండి టాలీవుడ్ లో పెద్ద బడా దర్శకుడు దిల్ రాజు.
బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న "పింక్" సినిమా రీమేక్ లో వీల్లద్దరి కాంబినేషన్ కుదిరిందని ప్రచారం జరుగుతుంది. పింక్ మూవీలో పవన్ నటిస్తున్నారన్న విషయం దిలరాజు ఒక ఇంటర్వ్యూ లో ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాళిగా ఉంటే అప్పుడు ఘాటింగ్ ప్రారంభమిస్తామని తెలిపారు. హీరోయిన్ ఎవరు అనేదానిమీద కూడా క్లారిటీ వచ్చిందని చెప్పారు.. బాలీవుడ్ లో హీరోయిన్ గా తాప్సి నటించారు. తెలుగులో తన నటనతో, అభినయంతో అలరించిన "నివేదా థామస్ "ని అనుకున్నారట.

ఈ సినిమాలో హీరోయిన్ కి యాక్టింగ్ పరంగా స్కోప్ ఉన్న పాత్ర అవ్వడంతో, అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అంటే ఎవరు కాదంటారు.. వెంటనే నివేదా కూడా ఓకే చెప్పేసిందట. ఈ సినిమా గూర్చి మరో ప్రచారం జోరుగా సాగుతుంది. మరో రెండు రోజులలో పూజా కార్యక్రమాలు దిల్ రాజు ఆఫీస్ లో స్టార్ట్ అవుతాయని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతందని తెలిపారు.. పవన్ కళ్యాణ్ లేని  సీన్లు మొదలుపెడతామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: