కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్ ని కాస్తా మార్చుకుని.. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' అనే టైటిల్ తో అన్ని రకాల అవాంతరాలు దాటి థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది. ఓ పక్క కోర్టు కేసులు, దానిపై రకరకాల వాదనలు, సెన్సారు వ్యవహారాలు, అధికారుల అడ్డంకులు ఇలా అన్నీ కంప్లీట్ అయిన తరువాత సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే మొదటి రోజు మొదటి ఆటకే ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలింది.   

 

అసలింతకీ ఇదంతా ఏ సినిమా గురించి అనుకుంటున్నారా అదే మన వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. వర్మ గత నెలరోజులుగా ఈ సినిమా ప్రచారాన్ని వివాదాలతోనే కానిచ్చేసిన ఆర్జీవీ చివరికి కోర్టులు.. సెన్సార్.. రివైజింగ్ కమిటీ ముందు పోరాడి నేడు థియేటర్లలోకి తెచ్చాడు. అయితే మోర్నింగ్ షోలకు జనం లేక క్యాన్సిల్ చేయడం అంతటా చర్చనీయాంశమైంది.

 

అసలింతకీ ఏమైంది? అని ఆరాతీస్తే.. రకరకాల వివాదాల వల్ల ఈ సినిమా రిలీజవుతోందా లేదా? అన్న సందిగ్ధతతో జనాలు అసలు థియేటర్ల వైపే చూడలేదట. పర్యవసానంగా ఉదయం ఆట వరకూ జనం లేక చాలా థియేటర్లు క్లోజ్ చేశారు. ఆరు గాలం శ్రమించిన ఆర్జీవీకి ఇది నిజంగానే ఇబ్బందికరమైన సన్నివేశమే. సినిమాలో కంటెంట్ ఎంత?  వివాదాల పర్సంటేజీ ఎంత? అన్నది మరో గంటలో రివ్యూల రూపంలో తెలిసిపోతుంది. సమీక్షల్ని బట్టి.. జనాల్లో మౌత్ టాక్ ని బట్టి ఇకనైనా థియేటర్లకు వెళ్లాలా వద్దా? అన్నది జనం నిర్ణయించుకుంటారు. బావుంది అన్న టాక్ వస్తే ఫస్ట్ షో పుంజుకునే ఛాన్సుంటుంది. లేదంటే వర్మ తన కెరీర్ లో మరో డిజాస్టర్ అందుకోవడం గ్యారెంటీ...అనుకున్నారు.

 

అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చి ఈ గురువారం థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు .. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ కోని విలన్లుగా చూపిస్తున్న నేపథ్యంలో ఏపీలో అల్లర్లకు ఆస్కారం ఉందని ఇంతకుముందు రివైజింగ్ కమిటీ... సెన్సార్ గడప ముందు వాగ్వాదం నడిచింది. కోర్టు కూడా ఈ విషయాన్ని పరిగణించి సెన్సార్ వాళ్లకే వదిలేశారు. చివరికి మ్యూట్ లు కట్ లతో ఈ చిత్రం రిలీజైంది. అయితే ఈ సినిమా సక్సస్ అన్న టాక్ వచ్చింది. కొన్ని చోట్ల మార్నింగ్ షో క్యాన్సిల్ అయినప్పటికి మ్యాట్నీ షో నుంచి రెస్పాన్స్ అదిరింది. వర్మ కూడా ఊహించని సక్సస్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: