మెగా మేనళ్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్లో వరుస హిట్లు కొట్టాడు. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న సాయి ధరంతేజ్ ఆ తర్వాత వరుస ప్లాపుల బాట పట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరు ప్లాపులతో కెరీర్ పరంగా పూర్తిగా డౌన్లో పడిపోయాడు. అసలు సాయిధరమ్ తేజ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అన్న సందేహాలు కలుగుతున్న క్రమంలో చిత్రలహరి సినిమా ఓ మోస్తరు హిట్ కొట్టి కెరీర్ పరంగా మళ్లీ ఎట్టకేలకు ట్రాక్ ఎక్కాడు.
చిత్రలహరి సినిమా సాయి కెరీర్కు ఊపిరి లూదిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ - రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా.. 'ప్రతిరోజూ పండగే'. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గురువారం సాయంత్రం మరో సాంగ్ రిలీజ్ చేశారు. థమన్ ట్యూన్కి సిరివెన్నెల అద్భుతమైన పదాలు రాయగా విజయ్ ఏసుదాస్ అంతే అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్రతి ఒక్కరు మనస్సులను టచ్ చేసేలా ఉంది. పాట వింటుంటే మరోసారి వినాలి అనిపించేలా ఉంది. కుటుంబ సంబంధాలు గొప్పగా చాటి చెప్పేలా లిరిక్స్ ఉన్నాయి.
''చిన్నతనమే చేర రమ్మంటే.. ప్రాణం నిన్న వైపే దారి తీస్తోందే.. అడుగులైతే ఎదరకైనా.. నడక మాత్రం వెనకకే.. గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురవుతున్నదే.. చెరిగిపోనే లేదే.. మరపురానే రాదే.. ఊహలే ఉప్పొంగుతున్నవిలా.. ముగియని కథలతో మది మేలుకున్నదిలా'' అంటూ సాగే ఈ చక్కటి మెలోడి హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఇక ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది.
https://www.youtube.com/watch?v=guoKAtppeJU&feature=emb_logo