యంగ్ రెబల్ స్టార్ ‘ ప్రభాస్ క్రేజ్ బాహుబలి’ తర్వాత ఖండాంతరాలు దాటింది. దీంతో దర్శకనిర్మాతలు ఈ స్టార్ హీరోతో సినిమాలు తీయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ‘జిల్’ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. అయితే అప్పుడే ఈ చిత్రం తర్వాత ప్రభాస్ తదుపరి మూవీ ఏంటనే దానిపై గుసగుసలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల్లో ఓ క్రేజీ వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ చిత్రాన్నీ సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రభాస్తో ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. భారీ సినిమాలను తీయడంలో శంకర్ స్పెషలిస్టు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే శంకర్ రోబో, అత్యున్నత సాంకేతిక విలువలతో 2.0 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలన తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ప్రభాస్ మాత్రం ‘సాహో’ సినిమా ఫలితం ఎలా ఉన్నా బాలీవుడ్లో మంచి మార్కెట్ను ఏర్పరుచుకున్నాడు. దీంతో శంకర్ ఈ యంగ్ రెబల్ స్టార్తో భారీ బడ్జెట్తో పాటు తన మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని తీయాలని భావిస్తున్నట్లు.. ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే స్క్రిప్ట్ను కూడా సిద్దం చేసినట్లు సమాచారం. అయితే హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హై బడ్జెట్ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు అనధికారిక సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే శంకర్ డైరెక్ట్ చేయబోతున్న తొలి తెలుగు హీరోగా ప్రభాస్ నిలవనున్నాడు. గతంలో తెలుగు హీరోలతో పలుమార్లు సినిమా తీయాలని శంకర్ భావించినప్పటికీ ఫర్ఫెక్ట్ కాంబినేషన్ కుదరలేదు.
కాగా, ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు బాహుబలి కంటే భారీ రేంజ్లో తీయాలని భావిస్తున్నట్లు కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్కు ప్రభాస్ ఓకే చెప్పినట్లు.. పూర్తి స్క్రిప్ట్తో రావాలని సూచించారని మరో వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు శంకర్ కమల్హాసన్తో ‘భారతీయుడు 2’ చిత్రంతో బిజీగా ఉన్న .. ఈ మూవీ తర్వాతనే ఆ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. అయితే కోలీవుడ్ మాత్రం కమల్ సినిమా తర్వాత చియాన్ విక్రమ్తో శంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తారని అంటోంది. అయితే ‘భారతీయుడు 2’తర్వాత శంకర్ డైరెక్ట్ చేయబోయేది విక్రమ్తోనా లేక ప్రభాస్తోనా అని సినీ విశ్లేషకులు తెగ చర్చించుకుంటున్నారు.