ఇప్పుడు ఆ హీరోయిన్ ఆషామాషీ హీరోయిన్ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. అలాంటి అమ్మాయిని సినిమాలో పెట్టుకొని ప్రచారంలో లేకుండా వదిలేశారు. చివరికి టీజర్ లో కూడా ఆమెను పట్టించుకోలేదు. ఇన్నాళ్లకు యూనిట్ కు రష్మిక గుర్తొచ్చినట్టుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి మహేష్-రష్మిక కాంబోలో 2 పోస్టర్లు రిలీజ్ చేశారు. నిజానికి రష్మిక కనిపించేలా గతంలో ఓ స్టిల్ రిలీజ్ చేసినప్పటికీ అది లిరికల్ వీడియోస్ లో భాగంగానే వచ్చింది. పైగా చుట్టూ క్యారెక్టర్ ఆర్టిస్టులతో పెద్ద గుంపు. మహేష్-రష్మిక జంటగా మాత్రం ఒక్కటంటే ఒక్క స్టిల్ కూడా రాలేదు. ఇన్నాళ్లకు మహెష్ ఫ్యాన్ కున్న ముచ్చట తీరింది.

 

సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ లో రష్మిక లేకపోవడంతో, ఆమెపై ఓ స్పెషల్ కట్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు. మహేష్-రష్మిక కాంబోలో ఓ రొమాంటిక్ విజువల్ బయటకొచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ యూనిట్ మాత్రం ఆ దిశగా ఆలోచినట్టు కనిపించలేదు. బ్రాండ్ న్యూ పోస్టర్ అంటూ స్టిల్ రిలీజ్ చేసి ఊరుకున్నారు.మరోవైపు సినిమాకు సంబంధించి విడుదల చేస్తున్న పాటలేవీ ఆకట్టుకోకపోవడంతో, యూనిట్ ప్లాన్ మార్చింది. కొన్నాళ్లపాటు సాంగ్స్ పక్కనపెట్టి.. కేరళలో ప్రత్యేకంగా షూట్ చేసిన ప్రమోషనల్ వీడియోస్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఓవైపు అల వైకుంఠపురములో టీజర్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, మరో పాట రిలీజ్ చేసి చేతులు కాల్చుకునేకంటే నేరుగా వీడియోస్ రిలీజ్ చేసి సినిమా మీద క్రేజ్ పెంచాలని ప్లాన్స్ వేస్తున్నారట. అందుకే రష్మిక తో గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. 

 

ఇక ఈ సినిమాతో పాటు 2020 సంక్రాంతికి పోటీగా ఉన్న అల్లు అర్జున్-త్రిక్రం కాంబోలో రెడీ అవుతున్న అల వైకుంఠపురములో సినిమా ముందు నుంచి ప్రమోషన్స్ లో ఫుల్ల్ స్పీడ్ గా ఉంది. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రోమోస్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సినిమా మీద విపరీతంగా క్రేజ్ ని పెంచేసింది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ దర్బార్ కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. మరి రెండు భారీ సినిమాల నుండి మహేష్ ఎలా తట్టుకుంటాడో చూడాలి. ఇక మరో వైపు దేవీ సాంగ్స్ కూడా డల్ గా ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజైన సూర్యుడివో చంద్రుడివో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: