నట సింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' ఈ నెల 20 వ తేదీన విడుదల అవుతోంది. జై సింహ ను తెరకెక్కించిన కె.ఎస్.రవికుమార్-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే బాలయ్య తన నెక్స్ట్ సినిమాకి ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అందుకే ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. 

 

ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పుడు ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో బాగా చక్కర్లు కొడుతుంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ కు అటు ట్రేడ్ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలకు తగ్గట్టే భారీగా రూ. 70 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. బాలయ్య సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పేరును పరిశీలిస్తున్నారట. 'దబాంగ్' సినిమాతో బాలీవుడ్ తెరపైకి దూసుకొచ్చిన సోనాక్షి ఇప్పటివరకూ చాలా మంది టాప్ సీనియర్ బాలీవుడ్ హీరోలతో జతగా నటించింది. ఒకవేళ సోనాక్షి కి పారితోషికం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా తిరిగి రాబట్టుకోవచ్చు. అందుకే నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్ వైపు మొగ్గు చూపిస్తున్నారట.

 

అంతా అనుకున్నట్టు జరిగితే బాలయ్య సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్‌గా సోనాక్షి 50-60 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ హీరోల్ల ఫీలవుతు మాలాంటి వాళ్ళతో స్క్రీన్ మీద రొమాన్స్ కి రెడీ అవుతున్నారు. అంటు సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇప్పుడు బాలాయ్య సరసన నటించడానికి సోనాక్షి ఒప్పుకుంటుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: