ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్ లలో రాశిఖన్నా కి మంచి క్రేజ్ ఉంది. మొట్టమొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలతో అందరితో జతకట్టి తనకంటూ సపరేట్ క్రేజ్ మరియు మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేష్ మరియు నాగచైతన్య నటించిన వెంకీ మామ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల కాబోతున్న క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ సినిమా గురించి ఇంకా అనేక విషయాల గురించి రాశిఖన్నా అదరగొట్టే రీతిలో తెలియజేస్తూ వస్తుంది.

 

తాజాగా పాల్గొన్న ఓ ప్రమోషన్ కార్యక్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలపై ఒక్కొక్కరి గురించి ఒక విధంగా ఈ ముద్దుగుమ్మ తన మనసులో చెప్పిన మాటలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మీ అభిప్రాయం ఏమిటంటే ఏ మాత్రం తడుముకోకుండా సూపర్‌స్టార్ అని చెప్పారు. అంతేకాదు ఏ సినిమాను ఎక్కువ సార్లు థియేటర్లో చూశారు, ఎన్ని చూశారనే ప్రశ్నకు తాను నటించిన తొలిప్రేమ సినిమాను ఐదుసార్లు చూసినట్టు తెలిపింది.

 

ఇక ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఆయనో అసాధారణ వ్యక్తి అని ..వెంకటేష్‌, నాగచైతన్య, నాని, ప్రభాస్‌, విజయ్ దేవరకొండ, రష్మిక.ఇలా అందరి గురించి తన మసనులోని అభిప్రాయాలను పంచుకుంది. ఇక పవన్‌కల్యాణ్ గురించి చెప్పమంటే ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవని, ఆయనో లెజెండ్ అని తన అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఇంకా వెంకీ మామ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మరియు అదే విధంగా తోటి నటీనటుల గురించి నాగచైతన్య గురించి అనేక విషయాలు ప్రమోషన్ కార్యక్రమాల్లో తెలపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: