టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్, తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి నటిస్తున్న వెంకీ మామ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ చైతన్య సోల్జర్ గా, అలానే వెంకీ రైతుగా నటిస్తున్న ఈ సినిమాపై అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఇద్దరిలోను మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్న తమ సినిమా తప్పకుండా వాటిని అందుకుని సక్సెస్ అయి తీరుతుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దాని తరువాత తమిళ మూవీ అసురన్ రీమేక్ లో అతి త్వరలో వెంకటేష్ నటించనున్నారు. 

 

బ్రహ్మోత్సవం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తరువాత మొదలు కానుందని, అలానే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవి కానుకగా థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వెంకీ మామ నేడు రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిన్న సాయంత్రం మీడియా మీట్ లో పలువురు మీడియా ప్రతినిధులతో వెంకటేష్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తనకు కెరీర్ పరంగా ఎన్నో మంచి విజయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం తన మేనల్లుడు చైతన్యతో కలిసి నటించిన ఈ వెంకీ మామ అనే సినిమా ఒకింత ప్రత్యేకమని, 

 

ఎందుకంటే తామిద్దరం కలిసి నటిస్తే చూడాలని తన తండ్రి రామానాయుడు ఎంతో తపించేవారని అన్నారు. ఆ కోరిక నేడు తీరిందని తెలిపారు. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రామ్ లతో కలిసి నటించిన తనకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాలో నటించాలని ఎప్పటినుండో ఉందని, తన మనసులో కోరికని వెలిబుచ్చారు వెంకీ. అతి త్వరలోనే ఆ అవకాశం వస్తుందని తాను భావిస్తున్నల్టు ఆయన చెప్పుకొచ్చారు. మరి ఆయన కోరిక రాబోయే రోజుల్లో ఎంతవరకు తీరుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: