తెలుగు రాష్ట్రాల్లో అనసూయ బుల్లితెర యాంకర్‌గా చాలా ఫేమస్. తన అభినయం, అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దీంతో అనసూయకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. ఇదే కాకుండా అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ కూడా తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 

 

ఇకపోతే అనసూయకు ఎంత పాపులారిటీ ఉందో అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫొటోలకు భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం స్కిన్ షో చేయడమే. ఈ కారణంగానే ఆమె ఎన్నో వివాదాలను కొని తెచ్చుకుంది. ఇక మరో సారి ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’ 350 స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా ఈ 37 ఏళ్ల సీనియర్ బుల్లితెర బ్యూటీ హాట్ డోస్ పెంచుతూ అందాల ఆరబోతకు తెరతీసింది. రెయిన్ బో కలర్ హ్యాండ్లూమ్స్ డిజైన్స్ తళుక్కున మెరుస్తూ, కవ్వించే కళ్లతో ముక్కుపుడక ధరించి డిఫరెంట్‌గా కనిపిస్తోంది అనసూయ..

 

 

డ్రెస్ ఏదైనా ఆరబోత మస్ట్ అన్న నియమం పెట్టుకున్న అనసూయ.. 37 ఏళ్లు దాటినా ఇద్దరు బిడ్డల తల్లైనా తనలోని గ్లామర్ యాంగిల్‌కి మరింత పదునుపెడుతూ జబర్దస్త్ లుక్స్‌తో, థైస్ షోతో అందాల కనువిందు చేస్తూ, తన ఫాలోవర్స్‌కి కైపెక్కిస్తోంది రంగమ్మత్మ. ఇకపోతే నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకు వెళ్లిన తరవాత ఒక్కోవారం ఒక్కో హీరో జబర్దస్త్ స్టేజ్ మీదికి వస్తున్నారు.

 

 

ఒకవైపు తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటూనే జబర్దస్త్ నవ్వుల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈవారం రోజాతో కలసి జడ్జిగా జబర్దస్త్ స్టేజ్‌ను షేర్ చేసుకున్నారు సాయి ధరమ్... ఇకపోతే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ వచ్చారు. ఆయన నటించిన ‘ప్రతిరోజు పండుగ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జబర్దస్త్ స్టేజ్ మీదికి వచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: