వెంకటేష్ దగ్గుబాటి లేదా విక్టరీ వెంకటేష్ జననం 13 డిసెంబర్ 1960 జన్మించారు. 30 సంవత్సరాల కెరీర్లో 72 చలన చిత్రాలలో నటించారు. అతను తెలుగు సినిమాలో అలాగే రెండు బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు. ఆయన ఏడు రాష్ట్ర నంది అవార్డులు,ఆరు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు.
తన సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు, భారతదేశంలో అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ సహ యజమానిగా ఉన్నారు వెంకటేష్. మూడు దశాబ్దాల కెరీర్లో ఎన్నో వాణిజ్యపరంగా చాలా విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు, తెలుగు వారియర్స్ కెప్టెన్గా, సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో టాలీవుడ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ప్రకాశం జిల్లాలోని కారంచెడు గ్రామంలో సినీ మొగల్, సినీ నిర్మాత, మాజీ ఎంపి దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు వెంకటేష్ దగ్గుబాటి జన్మించారు. అతనికి ఒక అన్నయ్య సురేష్ బాబు దగ్గుబాటి, ఒక చెల్లెలు లక్ష్మి ఉన్నారు. వెంకటేష్ తన పాఠశాల విద్యను చెన్నైలోని ఎగ్మోర్ లోని డాన్ బాస్కోలో చేసాడు. అతను చెన్నైలోని లయోలా కాలేజీ నుండి వాణిజ్యంలో బాచిలర్స్ పట్టభద్రుడయ్యాడు, యుఎస్ఎలోని మాంటెరీలోని మిడిల్బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి ఎంబీఏ పొందాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను చలన చిత్ర నిర్మాణంలో ప్రవేశించాలనుకున్నాడు, కానీ నటుడు అయ్యాడు.
వెంకటేష్ 1971లో వచ్చిన ప్రేమ్ నగర్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అతను 1986 లో కలియుగ పాండవులులో ఖుష్బు సుందర్తో కలిసి పూర్తి స్థాయి నాయకుడిగా అడుగుపెట్టాడు. ఇది అతనికి ఉత్తమ తొలి నటుడిగా నంది అవార్డును గెలుచుకుంది. తన కెరీర్ ప్రారంభ దశలో, కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలం లో వెంకటేష్ నటించారు, దీనిని 1989 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు; ఈ చిత్రం అతని నటనకు అతని రెండవ నంది అవార్డును పొందింది.
ఆ తర్వాత ప్రేమతో రా (2001),నువ్వు నాకు నచ్చావ్ (2001) మల్లీశ్వరి (2004) వంటి రొమాంటిక్ కామెడీల్లో నటించారు. ఆ తరువాత ఘర్షణ (2005) అనే యాక్షన్ చిత్రంలో కనిపించాడు. కుటుంబ చిత్రం సంక్రాంతి (2005),ఆడవారి మాటలకి అర్ధలు వేరులే (2007) చింతాకాయల రవి (2008) హిట్ గా నిలిచాయి. ఇటీవల అతను వరుణ్ తేజ్తో పాటు బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 - ఫన్ చిత్రాన్ని అందించాడు .