బాలకృష్ణ బోయపాటిల మూవీకి సంబంధించిన కథ విని హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్న కీర్తి సురేశ్ ఒక్కరోజు పూర్తి కాకుండానే తన నిర్ణయాన్ని మార్చుకుని బాలయ్యకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా కీర్తి యూటర్న్ తీసుకోవడానికి గల కారణం బాలయ్య పక్కన కీర్తి సురేశ్ ను హీరోయిన్ గా చూడగలమా అంటూ కొందరు చేసిన నెగిటివ్ కామెంట్స్ ఒక కారణం అయితే రజినీకాంత్ లేటెస్ట్ మూవీలో ఆమెకు హీరోయిన్ గా వచ్చిన అవకాశం మరొక కారణం. 

ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు బోయపాటిమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాక్షి సిన్హాతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరుపుతున్నట్లు టాక్. గతంలో సోనాక్షి రజినీకాంత్ తో ‘లింగ’ మూవీలో హీరోయిన్ గా నటించిన నేపధ్యంలో ఆమెకు దక్షిణాది సినిమారంగం పట్ల అవగాహన ఉండటమే కాకుండా ఆమె దక్షిణాది నుండి మంచి సినిమా ఆఫర్స్ గురించి ఎదురు చూస్తోంది. 

దీనికితోడు అనుష్క శర్మ అలియా భట్ లాంటి హీరోయిన్స్ హవా బాలీవుడ్ లో పెరిగిపోయిన తరువాత సోనాక్షికి బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో ‘దబాంగ్ 3’ లో నటిస్తోంది. ఈమూవీతో తిరిగి మళ్ళీ ఆమె ట్రాక్ లోకి రావాలని ఈ సినిమాలో ఆమె చాల గ్లామర్ గా కనిపిస్తోంది. 

ఈ విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకుని బోయపాటి చెప్పిన కథను ఆమె చాల శ్రద్ధగా విని బాలయ్య పక్కన నటించడానికి తనకు అభ్యంతరం లేదు అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సోనాక్షి చెప్పిన పారితోషికం బోయపాటికి ఎక్కువగా అనిపించినా సోనాక్షికి ఉన్న క్రేజ్ రీత్యా బాలయ్య మూవీకి బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ కు మంచి ధర పలుకుతుంది అన్న ఉద్దేశ్యంతో బోయపాటి సోనాక్షి విషయంలో చాల సానుకూలంగా ఉన్నట్లు లీకులు వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: