ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ హత్యాచారం నేపథ్యంలో మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏపీ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు–2019కు ఆమోదం తెలిపింది. నటుడు చిరంజీవి ఏపీ ప్రభుత్వం అతి త్వరగా ఈ సవరణనను ఆమోదించబడినది ఈ నిర్ణయాన్ని ఆయన ఎంతగానో అభినందించారు. ఏపీ ప్రభుత్వం ‘‘దిశా’ చట్టం–2019 పేరుతో తీసుకున్న నిర్ణయం అభినందనీయం.
ముఖ్యంగా ఈ చట్టం మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. నిజానికి దిశ సంఘటన నన్ను ఎంతగానో కలచివేసింది నన్నేకాదు ఆ సంఘటన మనందర్నీ కలచివేసింది. ఆ భావోద్వేగాలు తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి.
మన అందరిలో తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం ఉంది. అలాంటి సత్వర న్యాయం కోసం ముందుగా ఆంధ్రప్రదేశ్ తొలి అడుగు వేయడం హర్షణీయం. మరొక విషయం కూడా ఈ సవరణలో అనగా సీఆర్పీసీ (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్)ని సవరించడం ద్వారా నాలుగు నెలలు అంతకంటే ఎక్కవ పట్టే విచారణా సమయాన్ని మరింత ముందుకు అంటే 21 రోజులకు కుదించే వీలు ఉంది.
మహిళల గౌరవాన్ని సోషల్ మీడియాలో కించపరచడంలాంటివి చేస్తే ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ద్వారా తీవ్రమైన శిక్షలు విధించును , అలాగే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్నవాళ్లలో మరింత భయం కల్పించే విధంగా ఈ చట్టం తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రత్యేక కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడం వల్ల మహిళాలోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని ఓ ప్రకటనలో చిరంజీవి వెల్లడించారు.