టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరుస‌. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. మ‌రియు దిల్ రాజ్ , అనిల్ సుంకర లతో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కామెడి ఎంటర్‌టైనర్స్‌తో అలరించిన అనిల్ రావిపూడి తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇక సంక్రాంతి కానుకగా  జనవరి 11న ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్‌ ఉపందుకున్నాయి. డిసెంబర్‌లో ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న పారితోషకం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు మహేష్ బాబుకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ముట్టిందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినబడుతోంది. మహేష్ బాబు ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహ‌రించ‌డంతో.. ఈ సినిమాకు పారితోషకం కాకుండా సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్,డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను సన్ టీవీ వారు రూ. 30 కోట్లకు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఒక హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో రూ.15 వరకు ముట్టాయట. 

 

ఇక ఆడియో అవీ ఇవీ కలిపితే మరో రూ.5 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. ప్ర‌స్తుతం ఇదే ఇప్పుడు ఫిలం న‌గ‌ర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  కాగా, మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరుస సినిమాలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది.  ఈ సినిమాతోనే అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. మ‌రియు రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్స్ ,టిజర్, సాంగ్స్ సినిమాపైన మంచి అంచనాలును క్రియేట్ చేశాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: