ఈ మధ్య నందమూరి బాలకృష్ణ నటించే సినిమాలకు హీరోయిన్ కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. ఆయన సినిమాలకు అనుకున్న విధంగా కథానాయికలు దొరకడం లేదు. ఇక ఇదే కష్టం తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి కూడా వచ్చింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలని జరుపుకుంది. ఇక త్వరలోనే సినిమా షూటింగ్ జరగనుంది. ఈ క్రమంలో బోయపాటి....బాలయ్యకు జోడీగా సరైన కథానాయికని వెతికే పనిలో పడ్డారు.

 

ఈ నేపథ్యంలో బోయపాటి...మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ ని బాలయ్య సరసన నటించమని అడిగారట. కానీ ఆమె బోయపాటి ఆఫరుని సున్నితంగా తిరస్కరించరట. దీంతో బాలయ్యకు మళ్ళీ హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయని ప్రచారం మొదలైంది. ఈ తరుణంలోనే బోయపాటి...కేథరిన్ థెరీసాకు ఆఫర్ ఇవ్వగా, ఆమె వెంటనే ఒప్పేసుకుని బాలయ్య సరసన చేసేందుకు సిద్ధమైపోయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందట. త్వరలోనే రెండో హీరోయిన్ ని కూడా ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రోజా కూడా నటిస్తుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య-రోజాల మధ్య వచ్చే స్పెషల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని టాక్. ఇప్పటికే ఈ ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే, రోజా వైసీపీ ఎమ్మెల్యేగా ఉంది. మరి ఇలాంటి తరుణంలో వీరిద్దరు సినిమాలో కూడా ప్రత్యర్ధులు నటిస్తే ఇంకా మామూలుగా ఉండదు.

 

కాగా, మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని వేసవిలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు బాలయ్య కంటే బోయపాటికే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు 10 కోట్లు అయితే, బోయపాటికి 15 కోట్లు ఇస్తున్నారంటూ ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: