రామ్ గోపాల్ వర్మ శిష్యుడు సిద్ధార్థ్ తాతోలు తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అసలు రిలీజ్ కు ముందు వరకు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా ? అన్న సందేహాలు ఉన్నాయి. కొన్ని గంటల ముందే సెన్సార్ కంప్లీట్ చేసుకుని ఎట్టకేలకు థియేటర్ల‌ లోకి వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు పెంచేసిన వర్మ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు.

 

ఓవరాల్‌గా  సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా వర్మ ఏ ఆడియన్స్‌ను అయితే టార్గెట్గా చేసుకుని సినిమాను తెరకెక్కించాడో వాళ్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకు తనదైన శైలిలో ప్రచారం కల్పించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు చూస్తే మేజ‌ర్ గా ఏ క్లాస్ సెంట‌ర్ల‌తో పాటు ఏపీలో ని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు అయిన విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు లాంటి చోట్ల థియేట‌ర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.

 

ఇక సినిమా రిలీజ్ అయ్యాక వ‌ర్మ ఈ సినిమా వందకి వెయ్యి శాతం బ్లాక్ బస్టర్ హిట్టు అని తెలుపుతూ సినిమాకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ తాతోలు కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇక వ‌సూళ్లు గ‌ర్జిస్తున్నాయ‌ని కూడా వ‌ర్మ చెప్పాడు. సినిమాకు జ‌నం కొన్ని థియేట‌ర్ల లో పోటెత్తారు. అలాంటి ఒక ఫొటోను కూడా వ‌ర్మ త‌న ట్వీట్ట‌ర్ లో ట్వీట్ చేశాడు. ఈ ఫొటో సినిమా చూసేందుకు జ‌నం కిక్కిరిసి పోయి ఉన్నారు.

 

చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తొలివారం వసూళ్లు బాగా వచ్చే అవకాశం ఉంది. సినిమాలో చాలా మంది కొత్త నటీనటులే కావడంతో బడ్జెట్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం రాలేదు. బ్రహ్మానందం, ధన్‌రాజ్, కత్తి మహేష్‌లకు కాస్త ఎక్కువ పారితోషికం ముట్టినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: