సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ. మహేష్ బాబు - రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పటాస్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఆగడు సినిమాకు గతంలో పనిచేసిన అనిల్ ఇప్పుడు ఏకంగా మహేష్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. కంప్లీట్‌ యాక్షన్.. ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న.. ఈ సినిమా సంక్రాంతి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 

రీసెంట్ గా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ టీజర్ , సాంగ్స్ విశేషంగా ఆకట్టుకోవడమే కాదు సినిమా ఫై మరింత అంచనాలు పెంచేసింది. దీంతో సినిమా రైట్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఓవ‌రాల్‌గా రు.100 కోట్ల‌కు పైగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ఇక దీనికి తోడు శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ అద‌నం. ఇదిలా ఉంటే మ‌హేష్ సినిమ‌ల‌కు క‌ర్నాట‌క‌లో మంచి డిమాండ్ ఉంటుంది.

 

ఇక ఇప్పుడు స‌రిలేరు కర్ణాటక రైట్స్ ను బృందా అసోసియేట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బృందా అసోసియేట్స్ తెలియజేశారు. ఈ మూవీ హక్కుల కొరకు బృందా అసోసియేట్స్ ఫ్యాన్సీ ధర చెల్లించినట్లు తెలుస్తుంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి చాలా ఏళ్ల తరువాత సిల్వర్ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

 

సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్ రాజ్‌లతో పాటు అజయ్‌, బండ్ల గణేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్‌ రాజు బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో నిర్మాత అనిల్‌ సుంకరతో కలిసి మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: