జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది యువ నటులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కమెడియన్లను పరిచయం చేసింది. ఈ కామెడీ షోకు ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఆ ఫేమ్‌తోనే అనసూయ, రష్మీ గౌతమ్‌కు మాస్‌లో మాంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. మరోవైపు ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు.  నిన్నమొన్నటి వరకు ఈ షోకు నాగబాబు ఒక జడ్జ్‌గా వ్యవహరించేవారు. కానీ ఇటీవ‌ల జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

 

అయితే  ‘లోకల్ గ్యాంగ్స్’ మాత్రం అనుకున్న టీఆర్పీ రేటింగ్స్ మాత్రం నిర్వాహకులు ఊహించనంత రేంజ్‌లో లేవనే టాక్ వినబడుతోంది. దీంతో సోషల్ మీడియాలో నాగబాబు పై ట్రోల్స్ మొదలయ్యాయి. జబర్దస్త్ షో నుండి నాగబాబు పక్కకు తప్పుకోవడంతో ఈ షో రేటింగ్స్‌లో ఏమన్నా ఛేంజెస్ వస్తాయా అని నిర్వాహకులు భయపడ్డారు.కానీ ఈ షో ఎప్పిటిలాగే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా నాగబాబు లేకున్న ఆడియన్స్‌ ఈ జబర్ధస్త్  షో చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నరన్న సంగతి స్పష్టమైంది. ప్రస్తుతం రోజా ఒక్కరే ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మ‌రియు ఎవ‌రైనా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం వ‌స్తే నాగ‌బాబు స్థానం వాళ్లు కూర్చుంటున్నారు.

 

అయితే తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహాకుల‌కు భారీ ఝుల‌క్ త‌గిలింది. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్.. తాజాగా జబర్దస్త్ షో రేటింగ్స్‌ను క్రాస్ చేయడంతో నిర్వాహకులకు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇక‌ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ఆమోదించుకునే పనిలో ఉంది. ఈ క్ర‌మంలోనే ఎక్కువ మంది వ్యూయర్స్.. జబర్దస్త్ షో కంటే ఈ టీవీలో ప్రసారమయ్యే న్యూస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న‌ట్టు స్ప‌ష్టం అయింది. మ‌రి వ‌చ్చే వారం ఎలా ఉంటుంది  అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: