నేడు వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా వెంకీ మామ సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే కదా. రిలీజ్ రోజే వెంకీమామ చిత్రం పాజిటివ్ టాక్తో ముందుకు దూసుకెళతున్న తరుణంలో సీనియర్ హీరో వెంకటేశ్ స్పందించడం జరిగింది. ఒక వైపు సినిమా హిట్ టాక్ రావడంతో, మరో వైపు పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు, సన్నిహితుల శుభాకాంక్షల తెలియచేయడంతో వెంకీకి డబుల్ ధమాకాలాగా మారింది అనే చెప్పాలి.
ఈ సంతోష సమయంలో వెంకటేష్ తండ్రి మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడిని తలుచుకుంటూ భావోద్వేగానికి గురి అవ్వడం జరిగింది. ఈ సంతోషంలో నువ్వు వుంటే ఇంకా చాల బాగుంటుంది నాన్న అని తండ్రిని గుర్తు చేసుకోవడం జరిగింది. నాన్న ఎప్పుడు తన కొడుతో పాటు, మనవళ్ళతో కలిసి సినిమా తీయాలని అనుకునే వాడు అని తెలిపాడు. నాన్న చిరకాలం కోరిక ఈ సినిమాతో నెరవేరింది అని తెలియచేయడం జరిగింది.
కానీ ఈ విజయాన్ని కళ్లారా చూసేందుకు ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు అని వెంకీ భావన తెలిపారు. ఈ సందర్బంగా వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా తన ఇన్స్టాలో 'ఇలాంటి రోజున మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం నాన్నా! మిస్ యూ నాన్న’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. అంతేకాదు వెంకీమామ ఇప్పుడు మీ అందరిదీ. దగ్గరలోని థియేటర్కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి అని వెంకటేశ్ తెలియచేయడం జరిగింది. అలాగే చైతూతో చిన్నప్పుడు దిగిన ఫోటోను, వెంకీమామ చిత్రంలోని స్టిల్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది.
మొత్తానికి వెంకటేష్ బర్త్డే సందర్భంగా విడుడలైన వెంకీమామ హిట్ టాక్ సొంతం చేసుకుందనే చెప్పాలి. సినిమాలో మామ - అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలోఎదురైన అనూహ్య కష్టాలు అనే కథాంశంతో సింపుల్గా, రోటిన్గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్ప్లేను ఆసక్తికరంగా చూపించాడు అని అభిమానులు వాళ్ళ భావనలను వ్యక్తం చేయడం జరిగింది.