టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు. తన తోటి హీరోల కంటే మరియు అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఇతర హీరోల కంటే చాలా స్పీడ్ గా ప్రాజెక్టు ఓకే చేస్తూ చకచకా షూటింగ్ ముగించుకుని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సంవత్సరం ఏకంగా ఎఫ్ 2, వెంకీ మామ లాంటి రెండు సినిమాలు నటించి తన అభిమానులను అలరించారు. ఇదిలా ఉండగా తాజాగా వెంకటేష్ నటించిన వెంకీ మామ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రమోషన్ విషయంలో చాలా చురుగ్గా పాల్గొంటున్న విక్టరీ వెంకటేష్ తన కెరీర్ గురించి మరియు అదే విధంగా ఇండస్ట్రీ గురించి అనేక విషయాలు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల పాల్గొన్న కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా వెంకటేష్ ఉన్నట్లు బయట ఎక్కువ టాక్ నడుస్తోంది.... దానిపై మీ స్పందన ఏమిటి అని వెంకటేష్ ని ప్రశ్నించగా. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ… ఆసక్తికరమైన సమాధానం చెప్పుకొచ్చారు. ఏమన్నారంటే అంతలేదు.. ఒకట్రెండు చిత్రాలు సరిగా ఆడకుంటే.. వీడికి ఎక్కువైంది.. మల్టీస్టారర్ చిత్రాలు ఎందుకు.. సోలో హీరోగా చేయక అని కూడా అంటారు.. అసంగతి కూడా నాకు తెలుసు అని వెంకటేష్ అన్నారు. ఇదే సమయంలో మల్టీస్టారర్ స్టోరీలు మీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారా ఏ విధంగా ఆ ప్రాజెక్టు ఓకే చేస్తారు అని మీడియా ప్రశ్నించగా...వెంకటేష్ సమాధానమిస్తూ అలా ఆలోచిస్తే మల్టీస్టారర్ చిత్రాలు చేయలేం అని సమాధానం ఇచ్చాడు.

 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల లాంటి చిత్రాలు చేస్తున్నప్పుడు నా పాత్ర ఏంటి.. నేను చేయాల్సింది ఏంటి అని మాత్రమే ఆలోచించాను అని వెంకీ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయడం జరిగింది… రాబోయే రోజుల్లో ఛాన్స్ దొరికితే ఎవరితో మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని మీడియా చివరిగా ప్రశ్న వెయ్యగా… నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు నానితో మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని తన కోరిక బయట పెట్టాడు వెంకీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: