వరుస  పరాజయాల తరువాత  ఇటీవల  చిత్రలహరి  తో విజయాన్ని అందుకున్నాడు  సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈచిత్రం తరువాత ఆయన , ప్రతిరోజూ పండగే  తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. మారుతి డైరెక్ట్ చేసిన  ఈ చిత్రం వచ్చే వారం  విడుదలకానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం  బస్ యాత్రను నిర్వహిస్తుంది చిత్ర యూనిట్.  ఇక  ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్  పాజిటివ్ రెస్పాన్స్ ను  రాబట్టుకొని సినిమా పై  అంచనాలను పెంచేసింది. 
 
 
 ఈ చిత్రంలో  సాయి ధరమ్ తేజ్  సిక్స్ ప్యాక్  బాడీ తో కనిపించనున్నాడు.  సినిమా లో  వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా  తేజూ  తన  బాడీ ని చూపించనున్నాడు.  పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా  తమన్ సంగీతం అందిస్తున్నాడు.  యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2  సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా  తమిళ నటుడు సత్యరాజ్  కీలకపాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ చిత్రం తో తేజూ  వరుసగా  రెండో విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. 
 
ఇక  సాయి ధరమ్ ప్రస్తుతం  నూతన దర్శకుడు  సుబ్బు డైరెక్షన్ లో  సోలో బ్రతుకే సో బెటర్ అనే  చిత్రంలో నటిస్తున్నాడు.   రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాభ నటేష్  హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.  ఈసినిమా తో పాటు సాయి ధరమ్ ..  ప్రస్థానం  ఫేమ్  దేవాకట్టా తో కూడా  సినిమా  చేయనున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది  జనవరి లో ప్రారంభం కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: