తెలుగు లో ఈ మద్య క్రేజీ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షో, పటాస్. ఈ రెండు కార్యక్రమాలకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగిపోయింది. జబర్ధస్త్ ఏడు సంవత్సరాల నుంచి రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు పరిచయం అయ్యారు. ఇందులో పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్స్ వెండితెరపై రాణిస్తున్నారు. ఇటీవల జబర్ధస్త్ కామెడీ షో సంచలన వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఏడేళ్లుగా జబర్ధస్త్ కి జడ్జీగా వ్యవహరిస్తున్న నాగాబాబు వెళ్లిపోయారు. ఆయనతో పాటు కొంత మంది టీమ్ లీడర్లు వెళ్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పటాస్ లో యాంకర్ రవి, శ్రీముఖి జోడీ కి మంచి క్రేజ్ వచ్చింది.
రచ్చ రాములమ్మగా శ్రీముఖి చేసే అల్లరి.. రవి డబల్ మీనింగ్ యాంకరింగ్ మొత్తానికి ఈ షోని మంచి పొజీషన్లోకి తీసుకు వచ్చింది. కానీ ఈ మద్య పటాస్ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. శ్రీముఖి కి బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం... చివరి వరకు తగ్గ పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలవడం మరింత పాపులారిటీ సంపాదించి పెట్టింది. ఇదే సమయంలో పటాస్ నుంచి రవి తప్పుకోవడం జరిగింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది ఫీమేల్ యాంకర్స్లో శ్రీముఖి కూడా ఉంది. సుమను రేస్లోంచి పక్కనబెడితే రెండోస్థానంలో అనసూయ.. మూడు రష్మీ గౌతమ్ తీసుకున్నారు. ఆ నాలుగో స్థానంలో ఎప్పట్నుంచో శ్రీముఖి అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఆ మద్య యాంకర్ రవితో గొడవల కారణంగానే ఆమె తప్పుకుందనే ప్రచారం కూడా జరిగింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పటాస్ మళ్లీ చేస్తారా అంటే రవితో యాంకరింగ్ చేయడానికి మా నాన్నను అడగాలంటూ శ్రీముఖి చెప్పడం మరో సంచలనం. ప్రస్తుతం పటాస్ లో జబర్ధస్త్ ఫేమ్ చలాకీ చంటి హస్ట్ చేస్తున్నారు. ఇక శ్రీముఖితో చంటీకి మంచి స్నేహం ఉంది.. పటాస్ లో ప్రస్తుతం వర్షిణి హోస్ట్ చేస్తుండటంతో ఆమెను తప్పించి శ్రీముఖిని తీసుకోవాలని చూస్తున్నారు మల్లెమాల ప్రొడక్షన్స్. ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ.. యంకర్ రవికి మాత్రం ఇది శ్రీముఖి ఇచ్చే షాకే అని చెప్పొచ్చు.