బాలీవుడ్ లో 'మున్నామైఖెల్‌'తో అనే సినిమా వెండి తెరకు  పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే తన అందాల ఆరబోతతో కుర్రాళ మనసు దోచింది.  కాకపోతే ఆ తర్వాత బాలీవుడ్ లో ఛాన్స్ దొరకలేదు.  సినిమాల కోసం హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కాకపోతే మొదటి సినిమా సవ్యసాచి పెద్దగా హిట్ కాకపోవడంతో నిధి అగర్వాల్ కి పేరు రాలేదు.  2019 సంవత్సరం లో తెలుగు లో వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన మిస్టర్ మజ్ను మూవీలో హీరోయిన్ గా నటించింది.  అయితే ఈ రెండు సినిమాలో ఈ అమ్మడికి కలిసి రాలేదు.  

 

ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది.  దాంతో ఇప్పుడు నిధికి వరుసగా తెలుగు లో ఛాన్సులు వస్తున్నాయి.  నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగారు... మోడలింగ్ పై ఎక్కువ దృష్టి పెడుతూ వచ్చింది. యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్.  కుటుంబంలో జన్మించిన ఆమె అర్థం చేసుకోవడంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మాట్లాడగలదు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి మున్నా మైఖేల్ మూవీలో అగర్వాల్ హీరోయిన్ నటించింది.  ప్రస్తుతం మరో తమిళ మూవీలో కూడా నటిస్తుంది.

 

ఈ మద్య హీరోయిన్లు సినిమాల్లో కన్న సోషల్ మీడియాలోనే ఎక్కువ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా బాలీవుడ్ భామలు.. విదేశాలకు వెళ్లి మరీ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తీయించుకొని తమ ట్విట్టర్, ఇన్స్ స్ట్రాగామ్ లలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మనసు దోచేస్తున్నారు. మరో విషయం ఏంటేంటే.. ఇలాంటి ఫోటో షూట్స్ తో దర్శక, నిర్మాతలకు వల వేయోచ్చు అనే ఆలోచన లేకపోలేదు. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో బంపర్ హిట్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ స్పీడ్ చూస్తుంటే తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: