టాలీవుడ్‌ యంగ్ అండ్ డైనమిక్ హీరో రానా దగ్గుబాటి భారీ ప్లాన్‌లో ఉన్నాడు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రానా, ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న రానా త్వరలో ఓ భారీ సినిమాని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తరువాత రానా ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ సినిమాలో చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా, ఆ పాత్రలో చాలా సన్నగా కనిపించాడు. అయితే ముందుగా క్యారెక్టర్‌ కోసమే రానా బరువు తగ్గాడని భావించినా, తరువాత ఆరోగ్యం సరిగాలేదన్న వార్తలు రావటంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తలను రానా ఖండించాడు. 

 

విదేశాల నుండి ఈ మధ్యే తిరిగి వచ్చిన రానా కొంత గ్యాప్‌ తీసుకొని తిరిగి షూటింగ్‌లకు హాజరయ్యాడు. మధ్యలో ఆగిపోయిన అరణ్య షూటింగ్‌ను పూర్తి చేసిన రానా, త్వరలో విరాటపర్వం సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాడని రాజా సమాచారం. నటుడిగా బిజీగా కొనసాగుతూనే నిర్మాతగానూ తన మార్క్‌ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే కృష్ణ అండ్‌ హిజ్‌ లీల అనే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు రానా. ఇక రానా ప్రధాన పాత్రలో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్దమవుతోంది. హిరణ్య కశ్యప పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. 

 

గత రెండు మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రానా తండ్రి, నిర్మాత సురేష్‌ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ మామ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలలో బిజీగా ఉన్న భల్లాలదేవ, హిరణ్య కశ్యప సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్టుగా లేటెస్ట్ గా అప్‌డేట్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాను బాహుబలిని మించేలా భారీగా తెరకెక్కించే ప్లాన్స్ లీ ఉన్నట్టుగా వెల్లడించాడు రానా. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను 2020 చివర్లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: