ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా అనేక రికార్డులను క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా విజయం సాధించడంతో ఎస్ ఎస్ రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. అంతగా 'బాహుబలి' సినిమా … ప్రపంచ సినిమానే ప్రభావితం చేసిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. భారతీయ చలన చిత్ర రంగంలోని బాహుబలి సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఎవరు అందనంత స్థాయిలో హిస్టరీ నమోదు చేసుకుంది. అటువంటి 'బాహుబలి' రికార్డ్స్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టార్గెట్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రాకముందు వరకు పూరి జగన్నాథ్ కెరియర్ చాలా డౌన్ ఫాల్ లో ఉంది.

 

అదే సమయంలో ఇండస్ట్రీలో ఒకప్పుడు డైరెక్టర్ పూరి తో సినిమాలు చేయాలని క్యూ కట్టే స్టార్ హీరోలు...పూరి కెరియర్ డౌన్ ఫాల్ లో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అంతగా సినిమా చేయడానికి ముందుకు రాలేదు అన్నది చాలాసార్లు పూరి డైరెక్ట్ గా మీడియా ముందు చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఎప్పుడైతే డైరెక్టర్ పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అదిరిపోయే మాస్ హిట్ అందుకోవడం జరిగింది ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ స్టార్ హీరోలు పూరి ఇస్ బ్యాక్ అని కామెంట్లు చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అవేమీ పట్టించుకోకుండా పూరిజగన్నాథ్ తన పని తాను చేసుకుపోతూ నెక్స్ట్ విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమాతో బాలీవుడ్ స్థాయిలో సినిమాను తెరకెక్కించి అతి తక్కువ సమయంలోనే సినిమాని కంప్లీట్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

 

పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దెందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నది. ఒక్క సినిమా కూడా బాలీవుడ్ లో చేయలేదు. 'అర్జున్ రెడ్డి' సినిమా తెలుగులో హిట్ కావడంతో ఆ సినిమాను 'కబీర్ సింగ్ ' పేరుతో రీమేక్ చేశారు. అప్పటి నుంచి విజయ్ కు అక్కడ కూడా క్రేజ్ పెరిగింది. దీంతో విజయ్ క్రేజ్ ని బేస్ చేసుకుని సినిమాని వీలైతే సౌత్ ఇండస్ట్రీ లో కూడా విడుదల చేసి 'బాహుబలి' రికార్డులను బ్రేక్ చేయడానికి డైరెక్టర్ పూరి ప్లాన్ చేస్తున్నట్లు...ఇందుమూలంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో 'బాహుబలి' సినిమాని దగ్గరుండి లాంచ్ చేసిన నిర్మాత కరణ్ జోహార్ తో... బాలీవుడ్ కి సంబంధించి  నిర్మాత బాధ్యతలు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కరణ్ జోహార్ కి అప్పజెప్పినట్లు సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: