చడీ చప్పుడు లేకుండా.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాకుండా 'పింక్' తెలుగు రీమేక్‌ను సైలెంట్‌గా లాంచ్ చేసేశారు చిత్ర యూనిట్. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ మళ్లీ సినిమాల్లోకి రారేమోనని అభిమానులు ఎంతో డీలాపడ్డారు. కానీ లక్కీగా పవన్ 'పింక్' రీమేక్‌లో నటిస్తానని ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ ఖూషీ అయ్యారు. అలాంటిది పవన్ కళ్యాణ్ నుంచి కానీ సినిమా యూనిట్ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రచారం లేదు. అయితే తాజాగా పింక్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ రంగం లోకి దిగాడు.

 

ఇప్పటికే పవన్ కోసం ఓ రాకింగ్ ట్యూన్‌ని కంపోజ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం. పవన్ సినిమాకు తమన్ తొలిసారి మ్యూజిక్ అందించబోతున్నారు. కాబట్టి పవన్‌ సినిమాకు ఉర్రూతలూగించే మ్యూజిక్ అందిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే హీరోయిన్‌తో రొమాన్స్‌లకు, వారి మధ్య వచ్చే పాటలకు, డ్యాన్స్‌లకు ఆస్కారం లేని సినిమా కాబట్టి పవన్‌ స్టైల్‌కు కథ మూడ్‌కు తగ్గట్టుగా సరిపోయే పాటను తమన్ కంపోజ్ చేశారట. అదీకాకుండా 'అల వైకుంఠపురంలో' సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెస్మరైజ్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అలానే 'పింక్' రీమేక్‌కు కూడా తమన్ ఏదో మాయ చేస్తాడన్న అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా ఏర్పడ్డాయి.

 

హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. నలుగురు మహిళలపై అత్యాచారం జరిగితే వారికి న్యాయం చేయడానికి ఓ న్యాయవాది ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. 'పింక్'ను తమిళంలో 'నేర్కొండ పార్వాయ్' టైటిల్‌తో రీమేక్ చేశారు. అందులో అజిత్ ప్రధాన పాత్రలో నటించారు. కోలీవుడ్ లోను ఈ సినిమా మంచి సక్సస్ ను అందుకుంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో మంచి సక్సస్ ను అందుకుంది కాబట్టి తెలుగులోనూ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరు అంచనా వేస్తున్నారు. అందులోను పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి..రీ ఎంట్రీ తో వస్తున్నారు కాబట్టి హిట్ పక్కా అని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: