మహేష్ బాబు మరియు రష్మిక మందన్నల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 95 శాతానికి పూర్తి అవడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం మిగిలి ఉన్న రెండు సాంగ్స్ ని చిత్రీకరించే పనిలో నిమగ్నమైంది సినిమా యూనిట్. టాలీవుడ్ యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మంచి కమర్షియల్, కామెడీ మరియు మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటిస్తున్నారు. 

 

లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి గారు చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండడంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భరత్ అనే నేను, మహర్షి సినిమాల వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్నారు. రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి ఇటీవల రెండు సాంగ్స్, మరియు టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా కోసం టీమ్ కొంత వైవిధమైన ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేస్తోంది. అందులో భాగంగా మొన్న ఈ సినిమాకు సంబందించిన ప్రత్యేక అతి పెద్ద బెలూన్లను ఆంధ్ర, తెలంగాణ లోని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 

 

ఇక నేడు ఏకంగా యూట్యూబ్ లో మంచి ప్రసిద్ధి గాంచిన షో అయిన 'మై విలేజ్ షో' వారితో కలిసి ఒక వీడియో ని రిలీజ్ చేసింది. ఆ షో ద్వారా గంగవ్వ మన అందరికి ఎంతో సుపరిచితమే. ఒకింత సరదాగా ఆమెతో కలిసి సరిలేరు మూవీ కోసం వేసిన సెట్ కు వెళ్లిన ఆ షో బృందం, అక్కడ దర్శకుడు అనిల్ రావిపూడిని కలిసి మాట్లాడడం వంటి అంశాలు తమ వీడియోలో పొందుపరిచారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. సరిలేరు టీమ్ వెరైటీ గా చేపట్టిన ఈ న్యూ ప్రమోషన్ ట్రిక్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి...... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: