మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, పటాష్ షో రెండు కామెడీ షో లుగా హవాను కొనసాగిస్తోంది.. ఈ షో లలో మొదలై సంవత్సరాలు అయిన కూడా షోలకు ఉన్న క్రేజ్ మాత్రం ఈ మాత్రం తగ్గలేదు.. కామెడీతో ఆకట్టుకుంటున్న ఈ షో లు మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే..


ఎంత ఉండి ఏం లాభం ఎలేవాడు లేకుంటే అన్నట్లు ఈ షో కు జడ్జీల ఫోబియా పట్టుకుంది.. ఈటీవీ లో టాప్ లో దూసుకుపోతున్న జబర్దస్త్ షో కు దాదాపు ఐదేళ్ల పాటుగా జడ్జిగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు ఈమధ్యే ఈ షో కు గుడ్ బై  గుడ్ బై చెప్పాడు.. ఇక ప టాష్ షో కు వ్యాఖ్యాత వ్యవహరించిన యాంకర్ రవి, శ్రీముఖి లు కూడా ఈ షో కు గుడ్ బై చెప్పేశారు...


ఇకపోతే ఈ విషయం పై తాజాగా స్పందించిన రవి షో నుండి తప్పుకోవడానికి గల కారణాలను చెప్పాడు..షో లో ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందని,  
నేను పటాస్ నుండి బయటకు వచ్చేయాలని ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు.. ఎప్పటి నుండో చర్చలు నడుస్తున్నాయి. చాలా మంది పటాస్ ఇంతకు ముందులా ఉండటం లేదని.. ఇంకా కొంచెం మార్చండి అనేవారు. మనం ఏం చేయగలం. రవి గాడు ఎంతవరకూ అని పంచ్‌లు వేస్తాడు. మొత్తం పిండేశారు.

 

కామెడీ షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎప్పుడు ముందుంటుంది.. అంతేకాకుండా కొత్తగా షో లను ఇంట్రడ్యూస్ చేయడం..కొత్త కొత్త కాన్సెప్ట్‌లు తీసుకురావడంతోపాటు ఆ ప్రొడక్షన్ హౌస్‌కి మంచి బలం ఉంది. కాని నేను ఎప్పుడూ ఇదే ఏం చేస్తాం కొత్తగా చేయాలని అనిపించింది. అందుకే దీనికి కొంచెం బ్రేక్ ఇచ్చి హాలీడేస్‌లో కొంచెం గ్యాప్ తీసుకుంటే మళ్లీ ఫ్రెష్‌గా చేస్తానేమో అనిపించింది పటాస్ నుండి బయటకు వచ్చేశా. నేను ఏం చెప్పినా వాళ్లు రాసుకున్నది వాళ్లు రాసుకుంటారు...అంటూ పటాష్  నుండి ఎందుకు బయటకొచ్చిన విషయం పై మొత్తానికి క్లారిటీ ఇచ్చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: