సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్ను కొత్త తరహాలో చేస్తూ హీటెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్నాళ్ళు సైలెంట్గా చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఊపందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే టీజర్తో పాటు సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్, మైండ్ బ్లాక్, సూర్యుడు చంద్రుడు సాంగ్స్ను విడుదల చేశారు. అయితే తాజాగా మరో సాంగ్ ప్రోమోను ఇంకా వినూత్నంగా విడుదల చేశారు. 'హి ఈజ్ సో క్యూట్' అనే సాంగ్కు హీరోయిన్ రష్మిక అదిరిపోయే స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తుంది. తన వ్యక్తిగత టిక్ టాక్ యాప్ ద్వారా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది రష్మిక. దేవి శ్రీ అందించిన రొమాంటిక్ సాంగ్కి క్యూట్ స్టెప్పులు వేస్తూ రచ్చ చేసింది రష్మిక మందన్న.
సంక్రాంతి బరిలో దిగుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రాక్ స్టార్ స్వరపరిచిన 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్, మైండ్ బ్లాక్, సూర్యుడు చంద్రుడు మూడు పాటలు పరవాలేదనిపించాయి. అయితే మహేష్ ఉన్న క్రేజ్కు రాక్ స్టార్ ఇచ్చిన పాటలు రీచ్ కాలేదనేమాట ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా విడుదలైన 'హి ఈజ్ సో క్యూట్' ట్యూన్ కూడా యావరేజ్ గానే ఉంది...తప్ప అద్భుతం అనేలా మాత్రం లేదు.
మహేష్ బాబు 'మహర్షి' తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు వరుస హిట్లతో దూకుడు మీద ఉన్న అనీల్ రావిపూడి.. మహేష్ను ఆర్మీ మేజర్ అజయ్ క్రిష్ణగా చూపిస్తుండటంతో ఈ అంచనాలు ఇంకా రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా ద్వారా విజయశాంతి టాలీవుడ్లో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించడం.. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ లాంటి భారీ తారాగణం ఉండటంతో సంక్రాంతికి మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' బాక్సాఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ఖాయమని గత్తమనేని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనీల్ సుంకర భారీ బడ్జెట్తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా 'సరిలేరు నీకెవ్వరు' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్-త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో కూడా సరిలేరు తో పోటీ పడబోతోంది.