టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి రెండు భాగాలూ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టి, తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేయడంతో ఆర్ఆర్ఆర్ పై అంతటి రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. 

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. స్వాతంత్రోద్య బ్యాక్ డ్రాప్ లో కొంత కల్పిత కథతో రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా రూ.450 కోట్లకుపైగా బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. కాగా ఆ తాజా షెడ్యూల్ కోసం హీరో ఎన్టీఆర్ మరియు దర్శకుడు రాజమౌళి ఇద్దరూ కూడా నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన సందర్భంగా అక్కడి కొందరు ప్రయాణీకులు వారిద్దరినీ వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేసారు. 

 

అయితే ఆ వీడియోని బట్టి చూస్తే ఎన్టీఆర్ లుక్ పై ప్రేక్షకుల్లో కొంత అవగాహనా రావడం జరిగింది. కాగా ఆ విధంగా ఫ్యాన్స్ కెమెరాలకు చిక్కిన ఎన్టీఆర్, రాజమౌళిని ఇద్దరినీ కూడా వారు వీడియో తీస్తూ ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారట. అనంతరం వారిద్దరి కారును కొందరు ఫ్యాన్స్ వెంబడించడం జరిగిందని, అయితే వారికి దొరికితే షూటింగ్ కి కొంత ఆలస్యమై అడ్డుకట్ట పడుతుందని భావించి  వారిద్దరూ కారులో వేగంగా వెళ్లిపోవడం జరిగిందట. కాగా ఈ మ్యాటర్ నిన్నటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: