ఓ హీరోయిన్ సినిమాను వదులుకున్న తర్వాత ఆ ఆఫర్ వేరే బ్యూటీకి వచ్చి ఆసినిమా కాస్త సూపర్ హిట్ అయిందనుకోండి.. సినిమా వదులుకున్న అమ్మడు బాధ వర్ణనాతీతం. టాలీవుడ్ హీరోయిన్లకు ఈ బాధ కోతేమీ కాదు దాదాపు అందరు అనుభవించిన వారే. త్వరలో ఈ పరిస్థితి రకుల్ కు రానుందంట అందుకు కారణం బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా.
ఎలా అనుకుంటున్నారా..? రియల్ మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య తెరపై కూడా అవే పాత్రలు పోషిస్తున్న సినిమా "వెంకీమామ" ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ హీరోయిన్ల ఎంపికకోసం చాలా కసరత్తు నడిచిందని తెలుస్తుంది. మొత్తానికి వెంకటేష్ సరసన పాయల్ నటించింది..
అలాగే నాగచైతన్య పక్కన హీరోయిన్గా ముందు చాలామంది బ్యూటీలను సంప్రదించారట. రారండోయ్ వేడుకచూద్దాంలో చైతు, రకుల్ జంట బావుందనే టాక్ వచ్చింది. దాంతో రకుల్ని కూడా సంప్రదించారు. కానీ రకుల్ హిందీ సినిమాలతో బిజీలో ఉండడంతో ఈ ఆఫర్ తిరస్కరించిందంట దాంతో ఈ ఛాన్స్ రాశీఖన్నాకు దక్కింది. దాంతో రాశీ ఎగిరి గంతేసిందంట అసలే సినిమా ఆఫర్లు కోసం కళ్ళు కాయల్లా ఎదురుచూస్తున్న రాశీకి ఈ సినిమాతో అదృష్టం ఒళ్ళో వాలినట్లయింది.
అయితే ఇప్పుడు ఈముద్దుగుమ్మ నలిగిపోతుందంట. దానికి కారణం రాశీ "వెంకీ మామ"తో పాటు సాయి తేజ్ నటిస్తున్న"ప్రతిరోజు పండగే"సినిమాలోనూ హీరోయిన్గా చేస్తుంది. కొద్ది రోజుల గ్యాప్ లోనే రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవ్వుతుండటంతో అమ్మడు ప్రమోషన్ కార్యక్రమాల బిజీలో ఉంది. అటు ఆ సినిమా ఇటు ఈ సినిమా రెండు సినిమాల ప్రమోషన్స్ లో రాశీ నలిగిపోతుందంట. మరి ఈ సినిమాలు హిట్ అయితే రాశీకి తిరుగుండదు . అందుకోసం ఈ మాత్రం కష్టపడటంలో తప్పులేదులే.. ఇప్పటికే సీనియర్ బ్యూటీలు స్లో అయిపోయారు దాంతో ఈ సినిమాల విజయం పై రాశీ ఖన్నా కెరియర్ డిపెండ్ అయిందనుకుంది.. మొత్తానికి సినిమా అయింది హీరోయిన్స్ రేంజ్ కూడా భారీగా పెరిగింది..